Samantha : అల్లు అర్జున్ పుష్ప మూవీలో సమంత తొలి సారిగా ఐటమ్ సాంగ్లో డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఊ అంటావా మామా.. ఊఊ అంటావా.. అంటూ సమంత అలరించింది. అయితే ఈ ఐటమ్ సాంగ్ చేసేందుకు సమంత మొదట వెనుకడుగు వేసింది. చివరి నిమిషం వరకు ఈ సాంగ్ను చేయొద్దనే అనుకుంది. కానీ అల్లు అర్జున్ చొరవతో సమంత ఎట్టకేలకు ఐటమ్ సాంగ్ చేసింది.
అయితే ఫిలింనగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. సమంత ఇంకో ఐటమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది. తన రెండో ఐటమ్ సాంగ్ ను చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నట్లు సమాచారం. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమాలో సమంత ఐటమ్ సాంగ్ చేయనుందని తెలుస్తోంది.
పుష్ప సినిమాకు సమంత వంటి స్టార్ హీరోయిన్ ఐటమ్ సాంగ్ ఎంత ప్లస్ అయిందో అందరికీ తెలుసు. అందుకనే లైగర్ టీమ్ కూడా తమ సినిమాలో సమంతతో ఐటమ్ సాంగ్ చేయించేందుకు ఆలోచిస్తున్నారట. దీంతో మూవీకి మరింత ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ, సమంత గతంలో మహానటి మూవీలో కలసి నటించారు.
విజయ్ దేవరకొండ లైగర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారనున్నాడు. హిందీ వెర్షన్ను కరన్ జోహార్ సమర్పిస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 25న లైగర్ మూవీ విడుదల కానుంది. పూరీ జగన్నాథ్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో విజయ్ దేవరకొండ ఎంఎంఏ ఫైటర్గా కనిపించనున్నాడు.
లైగర్ మూవీలో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటిస్తున్నారు. దీంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే సమంత ఈ మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తుందా.. లేదా.. అన్నది త్వరలోనే తేలనుంది. దీనిపై అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…