Samantha : ఏమాయ చేసావే మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ప్రస్తుతం సౌత్ లో తిరుగులేని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. అయితే గత కొంతకాలంగా సమంత పేరు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సామ్పై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. పర్సనల్ లైఫ్తోపాటు నటించిన సాంగ్స్, కనిపించే యాడ్స్.. ఇలా ఏదో ఒకరకంగా వార్తల్లో నిలుస్తోంది. అయితే సామ్ మాత్రం ఇవన్నీ లైట్ తీసుకుంది. అంతేకాదు సోషల్ మీడియాకు కొంతకాలంగా దూరంగా ఉంటుంది.
టాలీవుడ్ స్టార్ కపుల్ గా ఉన్న వీళ్ళు విడాకులు తీసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. ఎందుకు విడిపోయారు అనే దానిపై సామ్ తన సోషల్ మీడియా ద్వారా ఇన్డైరెక్ట్గా హింట్స్ ఇస్తుందే తప్ప అసలు విషయం చెప్పడం లేదు. నాగ చైతన్య కూడా ఇంత వరకు విడాకుల నిర్ణయంపై నోరు విప్పలేదు. తాజాగా నాగార్జున కూడా వీరి విడాకుల నిర్ణయంపై షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. అయితే విడాకుల తర్వాత సమంత అనేక ఆశ్రమాలకు దాన ధర్మాలు చేయడమే కాకుండా ఒక ఆశ్రమంలో సమంత ఈమధ్య ఒక హోమం చేసినట్లు వచ్చిన వార్తలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
వాస్తవానికి సమంత క్రిష్టియన్.. నాగచైతన్యతో పెళ్ళి జరిగినప్పుడు హిందూ, క్రిష్టియన్ సాంప్రదాయాల ప్రకారం పెళ్ళి రెండుసార్లు జరిగింది. చైతూ నుండి విడిపోయినా సమంత హిందూ ధర్మాలని పాటిస్తుంది. ఆలయాలకు వెళ్ళడం వల్ల మనశ్శాంతి కలిగి.. తాను ఏమిటో తనకు అర్థం అయ్యేలా ఉంది అంటూ ఆమధ్య కామెంట్స్ చేసింది. ఇక సమంత హైదరాబాద్ లోని కొన్ని ఆశ్రమాలకు భారీ విరాళాలు ఇస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు క్రిష్టియన్ సాంప్రదాయాలు కొనసాగిస్తూనే హిందూ ఆలయాలపై, ఆశ్రమాలపై సమంతకు ఎందుకు ఆసక్తి పెరుగుతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. దీనిపై సమంత స్పందిస్తే తప్ప అసలు విషయం తెలీదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…