Samantha : ఈ మధ్యకాలంలో నాగచైతన్య, సమంత ఇద్దరూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. సమంత కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొని సంచలన కామెంట్స్ చేసింది. విడాకులు తీసుకుంటున్నప్పుడు ఎంతగానో బాధపడ్డానని.. తమ విడాకులు అంత సులభంగా ఏమీ జరగలేదని.. ఆరంభంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నానని.. కానీ ఇప్పుడు అంతా సర్దుకుందని సమంత చెప్పింది. అంతేకాదు.. చైతన్యను భర్త అని పిలిచేందుకే ఆమె ఇష్టపడలేదు. మాజీ భర్త అని చెప్పమని సూచించింది. అలాగే చైతన్య, తనను ఇద్దరినీ ఒకే గదిలో బంధిస్తే.. పదునైన వస్తువులను దూరంగా ఉంచాలని కూడా చెప్పింది. అంటే.. వీరిమధ్య ప్రేమ కాస్తా శత్రుత్వంగా ఎలా మారిందో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే సమంత చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
అయితే సమంత గురించి మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాగచైతన్యకు పెళ్లయిన కొత్తలో గచ్చిబౌలిలో ఉన్న మురళీ మోహన్ ఇల్లు కావాలని అడిగాడు. అయితే ఆయన అది అమ్మడం కుదరదని చెప్పారు. దీంతో నాగార్జున ఎంటరై సర్ది చెప్పడంతో మురళీ మోహన్ తన అపార్ట్మెంట్ను చైతూకు విక్రయించారు. తరువాత సమంత, చైతూ ఇద్దరూ అందులోనే ఉన్నారు. కానీ ఇద్దరూ విడిపోయాక చైతూ కూడా ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే దగ్గర ఇల్లు కొని ఉంటున్నాడు. ఇక దాన్ని మళ్లీ మురళీ మోహన్కే ఇచ్చారట.
అయితే మురళీ మోహన్ ఆ ఇంటికి రిపేర్లు చేయిస్తుండగా.. సమంత వచ్చి ఆ ఇల్లు తనకే కావాలని.. తనకు ఎక్కడా ఇల్లు దొరకడం లేదని చెప్పి.. గతంలో కన్నా అధిక మొత్తాన్నే చెల్లించి మురళీ మోహన్ దగ్గర తిరిగి అదే అపార్ట్మెంట్ను కొనుగోలు చేసిందట. ఈ క్రమంలోనే సమంత ప్రస్తుతం ఆ ఇంట్లో తన తల్లితో కలసి ఉంటుందట. అయితే ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమే. ఇందులో నిజం ఎంత ఉంది.. అన్న విషయం తెలియాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…