Samantha : వెండితెరపై సంచలనాలు క్రియేట్ చేసిన ఎన్టీఆర్.. బిగ్ బాస్ షోతో బుల్లితెరని టచ్ చేశాడు. ఈ షో భారీ టీఆర్పీ రేటింగ్ సాధించింది. ఇక ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు. జెమిని టీవీలో ప్రసారం అవుతున్న ఈ షో హిందీలో సూపర్ హిట్ గా నిలిచిన కౌన్ బనేగా కరోడ్పతిఅనే ప్రోగ్రాంకి తెలుగు వర్షన్ గా రూపొందిన సంగతి తెలిసిందే. ఈ షో తొలి ఎపిసోడ్కి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, రెండు ఎపిసోడ్స్కి భారీ రేటింగ్ వచ్చింది. ఇక కొద్ది రోజులకి రాజమౌళి, కొరటాల శివ కూడా హాజరై ఆశ్చర్యపరిచారు.
ఎవరు మీలో కోటీశ్వరులు షోకి ఊహించిన టీఆర్పీలు రాకపోవడంతో పలువురు స్టార్స్ని గెస్ట్గా తీసుకొస్తున్నారు. ఈ షో మొదటి కర్టెన్ రైజర్ ఈవెంట్ ను రామ్ చరణ్ తో ప్లాన్ చేయగా, ఆ తర్వాత రాజమౌళి- కొరటాల శివ ఇద్దరితో ప్లాన్ చేశారు. ఇప్పటికే ఈ షోకి మహేష్ బాబు హాజరయ్యారు. ఆయన ఏకంగా పాతిక లక్షలు గెలుచుకున్నారు అని అంటున్నారు. మరోవైపు ప్రభాస్ ను ఎవరు మీలో కోటీశ్వరుడు టీమ్స్ సంప్రదించిందని ఎన్టీఆర్తో ప్రభాస్ కి కూడా మంచి సంబంధాలు ఉండడంతో ఆయనకు మాట ఇచ్చేశాడని అంటున్నారు.
ఇక తాజాగా నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న సమంతను హాట్ సీట్లో కూర్చోపెట్టేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సమంత పేరు ట్రెండింగ్లోఉండగా, ఈ అమ్మడిని తీసుకొస్తే షోకి మరింత టీఆర్పీ వస్తుందని నిర్వాహకులు భావిస్తున్నారట. దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి మరి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…