Samantha : పదేళ్ల ప్రేమాయణం.. మూడేళ్ల వైవాహిక బంధానికి తెర దించారు నాగ చైతన్య – సమంత. క్రేజీ కపుల్గా అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ జంట సడెన్గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడాన్ని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. చైతూ కంటే ఎక్కువ నెగిటివిటీని సమంతనే ఫేస్ చేస్తోంది. అందుకే విడాకుల ప్రకటన తర్వాత తన భావాలన్నీ పరోక్షంగా తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్తో పంచుకుంటోంది సామ్. ఇటీవల తనపై వస్తున్న పుకార్లకి సుదీర్ఘ పోస్ట్ ద్వారా సామ్ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని అనుకున్న సమంత పిల్లలని కనాలనే ప్లాన్ చేసిందని ఆమె సన్నిహితులు అంటున్నారు. అయితే ఇప్పుడు డైవోర్స్ తర్వాత మళ్లీ సినిమాలపై దృష్టి పెడుతుందట. భారీ బడ్జెట్ తో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమాని ఇప్పటికే పూర్తి చేసిన సామ్ ఓ తమిళ చిత్ర షూటింగ్తో బిజీగా ఉంది. ఇది పూర్తయ్యాక సమంత.. తాను ఒప్పుకున్నమూడు ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను వెల్లడించనుందని సమాచారం.
ఫ్యామిలీ మ్యాన్ 2 తర్వాత సమంతకు బాలీవుడ్ ఆఫర్స్ కూడా వస్తున్న నేపథ్యంలో ఆమె తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్ట్కి సైన్ చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ ప్రకటన చేయనుందని అంటున్నారు. సమంత నటించిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ ప్రస్తుతం డబ్బింగ్ జరుపుకుంటోంది. శకుంతలగా సమంత నటిస్తుండగా, దుష్యంతుడి పాత్రను ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ పోషిస్తున్నారు.
ఇక చిన్నారి భరతుడిగా అల్లు అర్జున్ కుమార్తే బేబీ అర్హ అలరించబోతోంది. సోమవారం నుండి డబ్బింగ్ ప్రారంభించినట్టు గుణ టీమ్ వర్క్స్ సంస్థ తెలిపింది. పాన్ ఇండియా మూవీగా పలు భారతీయ భాషల్లో ఒకేసారి వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…