Maa : మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ఏమెగానీ.. మరోసారి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న వర్గపోరు బయట పడింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ, మంచు ఫ్యామిలీ మధ్య వైరం ఉందంటూ ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తెలుగు సినిమా 75 వసంతాల వేడుకలో చిరంజీవిని అందరూ స్టేజిపై పొగడడం మోహన్ బాబుకు నచ్చలేదు. దీంతో ఆయన ఆ స్టేజిపైనే తన ఆవేశాన్ని వెళ్లగక్కారు.
అయితే అప్పటి నుంచి ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయిందని అడపా దడపా వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా మరోమారు మా ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఈ అంశం తెర మీదకు వచ్చింది. ఈ సారి ఈ వాదన బలంగానే వినిపించింది. దానికి తోడు ‘మా’ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని.. తాము ఇంకా అసోసియేషన్ ప్రతినిధులుగా ఉంటే.. రేపెప్పుడైనా ఏ కార్యక్రమాన్ని అయినా అడ్డుకుంటే తమపై బురద జల్లుతారేమోనని.. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు 11 మంది మూకుమ్మడిగా రాజీనామా చేశారు. దీంతో మంచు విష్ణుకు చక్కని అవకాశం దక్కినట్లు అయింది.
అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ అనేక సంచలన విషయాలను వెల్లడించారు. వాటిలో ఎక్కువగా మోహన్బాబు, నరేష్లపై చేసిన వ్యాఖ్యలే ఎక్కువగా ఉన్నాయి. ఈ సందర్భంగా బెనర్జీ మాట్లాడుతూ.. మీడియా ముందే కన్నీటి పర్యంతమయ్యారు. తనను మోహన్ బాబు బండ బూతులు తిట్టారని తెలిపారు.
ఇక మా అధ్యక్ష బరిలో ప్రకాష్ రాజ్ ఎప్పుడో ఉన్నారని.. అయితే ఈ విషయం తెలిసిన మోహన్ బాబు కావాలనే మంచు విష్ణును బరిలోకి దించారని.. చిరంజీవి నచ్చ జెప్పినా మోహన్ బాబు వినలేదని.. బెనర్జీ ఆరోపించారు.
ప్రకాష్ రాజ్ అందరికన్నా ముందే తన ఇష్టతను ప్రదర్శించారని, కనుక ఈసారికి ఆయనను మా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని, తరువాత విష్ణుకు చాన్స్ ఇద్దామని చిరంజీవి మోహన్బాబుకు చెప్పారట. అయినా మోహన్ బాబు పట్టుదలతో విష్ణును నిలబెట్టారట. అయితే ప్రకాష్ రాజ్ ను తీసేస్తాం, మోహన్ బాబును అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుందాం.. అని చిరంజీవి ఓపెన్ ఆఫర్ ఇచ్చారట. అయినప్పటికీ మోహన్ బాబు మాత్రం మంచు విష్ణునే పోటీలో నిలిపారని.. బెనర్జీ తెలిపారు. దీంతో చిరంజీవి హార్ట్ అయ్యారని అన్నారు.
అయితే ప్రకాష్ రాజ్ ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టడంతో ఇప్పుడు మంచు విష్ణు ప్రెస్ మీట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…