Samantha : విడాకుల తర్వాత సమంత ఎంత బిజీగా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు నిర్మాతలు ఆమె వెనుక క్యూ కడుతున్నారు. చైతన్యతో వివాహం తర్వాత పరిమితంగా సినిమాలు చేస్తూ వస్తున్న ఆమె విడిపోయిన తర్వాత వరుస సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. రెండు ద్విభాషా చిత్రాలకు ఒకే చెప్పింది. అందులో ఓ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్, మరో చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ సంస్థల్లో చేస్తోంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషనల్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప ది రైజ్’ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేస్తోంది. ఈ సాంగ్ కోసం ఏకంగా సమంతకు కోటిన్నర రూపాయలు రెమ్యునరేషన్గా ఇస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. సమంత త్వరలోనే బాలీవుడ్లోకి ప్రవేశించనుందని, హీరోయిన్ తాప్సీ ఈ సినిమాను నిర్మించబోతుందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలోనూ సమంత కథానాయిక అని అంటున్నారు.
2005లో అతడు, 2010లో ఖలేజా లాంటి సినిమాలు చేసిన తర్వాత ఈ కాంబినేషన్లో మూడో సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్నారు ఫ్యాన్స్. త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుండగా, ఇందులో పూజా హెగ్డేని కథానాయికగా అనుకున్నారు. కానీ ప్రాజెక్ట్లకు డేట్స్ సర్దుబాటు చేయడంలో ఆమె సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మహేష్ సినిమా ఆఫర్ వదులుకున్నట్టు తెలుస్తోంది. పూజా నో అనడంతో ఆ స్థానంలో సమంత వచ్చి చేరినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…