Samantha : తన పరువుకు భంగం కలిగించేలా కొన్ని యూట్యూబ్ చానల్స్ దుష్ప్రచారం చేశాయని ఆరోపిస్తూ.. సమంత తాజాగా కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తీర్పును న్యాయమూర్తి మళ్లీ వాయిదా వేశారు. దీంతో సమంత అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.
నిజానికి ఈ కేసును మొదట గురువారం విచారణ చేపట్టగా.. సమంత తరఫు లాయర్ బాలాజీ కోర్టుకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. సమంత నటి కనుక, బిజీగా ఉంటుంది కనుక కేసును త్వరగా ముగించాలని కోరారు. అయితే చట్టం ముందు అందరూ సమానులే అని.. సమంత ప్రత్యేకం ఏమీ కాదని.. అన్ని పరువు నష్టం కేసుల్లాగే ఆమె కేసును కూడా విచారిస్తామని.. న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కేసును శుక్రవారానికి వాయిదా వేశారు.
అయితే శుక్రవారం కోర్టులో మళ్లీ వాదనలు జరిగాయి. పరువు నష్టం కేసులో డబ్బు అడిగే బదులు క్షమాపణలు కోరాలని.. అడగవచ్చు కదా.. అని న్యాయమూర్తి అన్నారు. అయితే తాము డబ్బు అడగలేదని, క్షమాపణలు మాత్రమే కోరుతున్నామని, అలాగే సదరు యూట్యూబ్ చానల్స్ కు చెందిన లింక్లను కూడా డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని లాయర్ కోరారు. దీంతో శుక్రవారం నుంచి సోమవారానికి కేసు విచారణ వాయిదా పడింది.
ఇక సోమవారం కూడా విచారణ జరిగింది. ఈ క్రమంలోనే లాయర్ బాలాజీ మాట్లాడుతూ.. సమంత ప్రతిష్ఠ ను దెబ్బతీసిన మూడు యూట్యూబ్ ఛానల్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి పై ఇలా ఆరోపణలు చేస్తూ ప్రసారాలు చేయడం సరైంది కాదన్నారు. అనేక అవార్డులు, రివార్డులు సమంత తీసుకుందని, అలాంటి వ్యక్తి పేరు ప్రతిష్టలు దెబ్బతీసే విదంగా ప్రవరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సమంతను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వార్తలు ప్రసారం చేస్తున్నారని, ట్విట్టర్ వేదికగా విడిపోతున్నామని ప్రకటించగానే సోషల్ మీడియాలో సమంతను విపరీతంగా ట్రోల్ చేశారని అన్నారు. ఆమెపై ఇలా దుష్ప్రచారం చేయడం తీవ్రమైన నేరమని, ఆమెకు అక్రమ సంబంధాలు అంటగట్టారని.. కోర్టుకు తెలిపారు. ఇక తమ పిటిషన్ లో ఎక్కడా డబ్బులు అడగలేదని, యూట్యూబ్ లింకులు మాత్రమే తొలగించాలని కోరామని, అలాగే భవిష్యత్తులోనూ ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. కాగా గతంలోనూ శిల్పా శెట్టి కేసులో ముంబై హైకోర్టు ఇదే తరహాలో ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చిందని.. బాలాజీ కోర్టుకు తెలిపారు.
కాగా ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. మరి ఈ రోజు అయినా తీర్పు వస్తుందా.. లేక ఆలస్యం అవుతుందా.. అన్నది చూడాలి. కానీ.. తీర్పు ఆలస్యం అవుతుండడంపై సమంత నిరాశకు, అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…