Samantha : నాగచైతన్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించిన తరువాత నుంచి సమంత లైఫ్ ఎంతో బిజీగా మారిపోయింది. తరచూ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటోంది. ఓ వైపు సినిమా షూటింగ్స్ చేస్తూనే మరోవైపు సమయం లభించినప్పుడల్లా వెకేషన్లకు వెళ్తోంది. అలాగే పలు బ్రాండ్లకు చెందిన ఉత్పత్తులను కూడా ఆమె ప్రమోట్ చేస్తోంది. దీంతో ఆమె కేవలం ఇన్స్టాగ్రామ్ ద్వారానే నెలకు రూ.3 కోట్ల వరకు సంపాదిస్తోందని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సమంత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉంది. అయితే ఈమె ఈ మధ్య పాల్గొన్న కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించినట్లు సమాచారం.
కాఫీ విత్ కరణ్ జోహార్ షో అంటేనే వివాదాలకు మారుపేరు. ఈయన షో వల్ల గతంలో విడిపోయిన జంటలు ఉన్నాయి. అలాంటి షోకు సమంత గెస్ట్గా వెళ్లడంతో ఆమె తన విడాకుల వ్యహారంపై నోరు విప్పి ఉంటుందని భావించారు. అసలు ఆమె విడాకులు ఎందుకు ఇచ్చిందో అందులో చెప్పి ఉంటుందని అనుకున్నారు. కానీ దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ షోకు సంబంధించి ప్రోమోను తాజాగా లాంచ్ చేశారు. ఇందులో సమంత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో భాగంగా సమంత మాట్లాడుతూ.. చాలా మంది వివాహం అయ్యాక సంతోషంగా లేకపోవడానికి నువ్వే కారణమని ఆమె కరణ్ జోహార్ను ఉద్దేశించి మాట్లాడింది. అలాగే మీ సినిమాలు చూసి కభీ ఖుషీ కభీ ఘమ్ లా ఉంటాయని అందరే అనుకుంటారు. కానీ నిజ జీవితంలో మాత్రం కేజీఎఫ్లా ఉంటాయని సమంత మాట్లాడింది. అయితే ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సమంత, అక్షయ్ కుమార్ కలసి ఈ షోలో పాల్గొనగా.. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో కరణ్ జోహార్ స్వయంగా తన ధర్మ ప్రొడక్షన్స్ నిర్మాణంలో ఓ మూవీని తీస్తారని తెలుస్తోంది. ఈ షో సందర్భంగా ఆ మూవీ వివరాలను ప్రకటిస్తారని సమాచారం. ఈ షో 7వ సీజన్ జూలై 7వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇందులో పలు ఎపిసోడ్లలో ఇతర బాలీవుడ్ స్టార్స్ కూడా సందడి చేయనున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…