Samantha : సోషల్ మీడియాలో సమంత ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు తాను చేసే పనులు, పాల్గొనే కార్యక్రమాలకు చెందిన ఫొటోలను ఆమె షేర్ చేస్తుంటుంది. అయితే ఇటీవలి కాలంలో నాగచైతన్య లేకుండా ఆమె ఒంటరిగా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటుండడం చర్చనీయాంశంగా మారింది.
నాగచైతన్య, సమంత ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయని, సమంత ప్రవర్తన అక్కినేని ఫ్యామిలీకి నచ్చడం లేదని.. అందుకనే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారని.. ఈ మధ్య వార్తలు బాగా వస్తున్నాయి. అందుకు బలం చేకూర్చేలా సమంత ఎక్కడికి వెళ్లినా ఒంటరిగానే వెళ్తోంది.
ఇక నాగచైతన్య తాజా మూవీ లవ్స్టోరీకి సంబంధించి సమంత ఎలాంటి కామెంట్లు చేయలేదు. సాధారణంగా చైతూకు చెందిన ఏ మూవీ లాంచ్ అయినా, రిలీజ్ అయినా ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంది. కానీ ఇప్పుడలా పెట్టలేదు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారన్న విషయానికి మరింత బలం చేకూరినట్లయింది.
అయితే సమంత తాజాగా హైదరాబాద్కు చెందిన కొందరు సైక్లిస్టులతో రైడ్కు వెళ్లింది. 21 కిలోమీటర్లు ప్రయాణించానని, 100 కిలోమీటర్లు సైకిల్ తొక్కేందుకు ముందుకు సాగుతున్నానని, త్వరలో ఆ దూరం కూడా పూర్తి చేస్తానని సమంత చెప్పింది. ఇదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది.
ఇక తాజాగా ఆమె కీర్తిసురేష్, త్రిషలతో పార్టీకి అటెండ్ అయింది. ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి. అలాగే లవ్స్టోరీ విడుదల సందర్భంగా హైదరాబాద్కు అమీర్ఖాన్ రాగా నాగచైతన్య, నాగార్జున ఆయనతో చిన్న పార్టీ చేసుకున్నారు. అందులోనూ సమంత కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్ మరింత ఆందోళన చెందుతున్నారు. చైతూతో విడాకుల సంగతేమిటి ? స్పష్టత ఇవ్వు.. అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయం ఎప్పటికి తేలుతుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…