Warangal : ఎన్నో అనారోగ్య సమస్యలతో మంచాన పడిన తల్లి.. ఆమెకు సేవలు చేస్తూ అలసిపోయిన తండ్రి.. తమ పిల్లలకు భారం కాకూడదన్న ఉద్దేశంతో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కూల్ డ్రింక్ లో విషపు గుళికలు కలుపుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం..
చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన నరిగే కొమురయ్య – ఐలమ్మ దంపతులకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఐలమ్మ పక్షవాతంతో మంచాన పడింది. నిత్యం తన భార్యకు ఆ భర్త సేవలు చేస్తూ ఎంతో అలసిపోయాడు. ఈ క్రమంలోనే రోజు రోజుకూ వారు తమ పిల్లలకు భారం అవుతున్నారని భావించిన ఈ దంపతులు ఎంతో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై తమ పిల్లలకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.
కొమురయ్య కూల్ డ్రింక్ లో విషపు గుళికలు కలిపి తను తాగి తన భార్యకు తాగించాడు. కూల్ డ్రింక్ తాగిన ఆ దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడు తన తల్లిదండ్రుల కోసం చూడగా తల్లిదండ్రులు లోపల తలుపులు వేసుకొని ఉండడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి తన తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో కనిపించారు. వీరికి సరైన చికిత్స అందించడం కోసం వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఐలమ్మ పరిస్థితి కుదుటపడింది. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల అతన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…