Warangal : ఎన్నో అనారోగ్య సమస్యలతో మంచాన పడిన తల్లి.. ఆమెకు సేవలు చేస్తూ అలసిపోయిన తండ్రి.. తమ పిల్లలకు భారం కాకూడదన్న ఉద్దేశంతో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కూల్ డ్రింక్ లో విషపు గుళికలు కలుపుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం..
చెన్నారావుపేట మండలం లింగాపురం గ్రామానికి చెందిన నరిగే కొమురయ్య – ఐలమ్మ దంపతులకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఐలమ్మ పక్షవాతంతో మంచాన పడింది. నిత్యం తన భార్యకు ఆ భర్త సేవలు చేస్తూ ఎంతో అలసిపోయాడు. ఈ క్రమంలోనే రోజు రోజుకూ వారు తమ పిల్లలకు భారం అవుతున్నారని భావించిన ఈ దంపతులు ఎంతో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇకపై తమ పిల్లలకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.
కొమురయ్య కూల్ డ్రింక్ లో విషపు గుళికలు కలిపి తను తాగి తన భార్యకు తాగించాడు. కూల్ డ్రింక్ తాగిన ఆ దంపతులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. పొలం నుంచి ఇంటికి తిరిగి వచ్చిన కుమారుడు తన తల్లిదండ్రుల కోసం చూడగా తల్లిదండ్రులు లోపల తలుపులు వేసుకొని ఉండడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి తన తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో కనిపించారు. వీరికి సరైన చికిత్స అందించడం కోసం వెంటనే ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం ఐలమ్మ పరిస్థితి కుదుటపడింది. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్ల అతన్ని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…