Samantha : సమంత, నాగ చైతన్య జంటని చూస్తే ఎంత చూడ ముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట గతేడాది అక్టోబర్ 2న విడిపోతున్నట్టుగా ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2009లో ఏ మాయ చేశావె చిత్రం సెట్స్లో కలుసుకున్న ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. తెరపైనే కాకుండా నిజజీవితంలో కూడా వారి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఎందుకు విడిపోయారో కూడా ఎవరికీ తెలియదు. అయితే తెలుగు ఇండస్ట్రీలో కొన్ని రోజుల నుంచి నాగ చైతన్య, సమంత గురించి టాపిక్స్ నడుస్తూనే ఉన్నాయి.
సమంత-చైతూ ఎందుకు విడిపోయారనే విషయంపై ఎవరికి తోచింది వాళ్లు చెబుతూనే ఉన్నారు. మరికొందరు అయితే ఏకంగా డిబేట్స్ పెట్టి.. కచ్చితమైన కారణాలు ఇవే అంటూ కుండ బద్దలు కొడుతున్నారు. సమంత పిల్లలు కనడానికి ఒప్పుకోలేదని.. సరోగసి వైపు అడుగులు వేసినందుకే చైతూ ఈ నిర్ణయం తీసుకున్నాడని కొందరు చెప్తున్న కారణం. పైగా సూపర్ డీలక్స్, ది ఫ్యామిలీ మ్యాన్ 2 లలో సామ్ ఇంట్లో చెప్పకుండా బోల్డ్గా నటించడం వంటివి కూడా కారణాలుగా కనపించాయి. ఏదేమైనా చైతూ నుండి విడిపోయిన తర్వాత ఆయనకు చాలా దూరంగా ఉంటుంది సమంత. ఇప్పటికే తన ఇన్స్టాగ్రామ్ నుంచి నాగ చైతన్య ఫోటోలను డిలీట్ చేసిన సామ్ కొద్ది రోజుల క్రితం అన్ఫాలో కూడా చేసేసింది.
అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున, రానా, వెంకటేష్ కుమార్తె ఆశ్రితలను ఇంకా ఫాలో అవుతున్న సామ్ చైతన్యను మాత్రమే అన్ఫాలో చేసింది. అంతే కాదు అతనికి బర్త్ డే శుభాకాంక్షలు కూడా చెప్పకుండా ఆశ్చర్యపరచింది. అయితే తాజాగా అఖిల్ బర్త్ డే కాగా ఆయన ఫోటో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్డే అఖిల్. ఈ ఏడాది అంతా నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. నువ్వు కోరుకున్నవన్నీ దక్కాలని దేవుడ్ని కోరుకుంటున్నా.. అంటూ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే సమంత పోస్ట్పై అఖిల్ స్పందించలేదు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…