Samantha : సమంత, నాగచైతన్య విడిపోవడానికి అసలు కారణం ఆమెనా..?

Samantha : టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ కపుల్స్ గా ఉన్న నాగ చైతన్య, సమంత విడిపోయి దాదాపు ఏడాది గడుస్తోంది. వీరి విడాకుల విషయం ఫ్యామిలీ మెంబర్స్ కి మాత్రమే కాదు అభిమానుల గుండెల్లో కూడా పెద్ద బాంబు పేలినట్లు అయ్యింది. ఇప్పటికీ వీరిద్దరూ ఎందుకు విడిపోయారనే విషయంపై  అభిమానుల్లో ఏదో రకంగా చర్చ జరుగుతూనే ఉంది.

అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా చై సామ్ పై అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. సమంత కూడా ఛాన్స్ దొరికితే చాలు అక్కినేని కుటుంబాన్ని ఇన్ డైరెక్ట్ గా విమర్శిస్తూనే ఉంది. ఎంతో చూడముచ్చటగా ఉండే ఈ జంట 2017లో వివాహం చేసుకుని గత ఏడాది అక్టోబర్ లో విడాకులు తీసుకుని విడిపోయిన సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరి విడాకులకు గల అసలు కారణం ఏమిటనేది అభిమానుల‌కు ఇప్పుడు కూడా చిక్కు ప్రశ్నగా మిగిలింది. వీరు ఎందుకు విడాకులు తీసుకున్నారనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. సోషల్ మీడియాలో మాత్రం వీరిపై ఇప్పటికీ వార్తలు ప్రసారం అవుతూనే ఉన్నాయి.  ఎవరికి నచ్చినట్లు  వారు ఊహించుకుని వార్తలు ప్రచురిస్తున్నారు. అన్ని వార్తలు ప్రసారం అవుతున్నా కూడా వీరిద్దరూ ఏమీ జరగనట్లు తమ కెరియర్ గురించి ప్లాన్స్ చేసుకుంటూ ఫుల్ బిజీగా ఉన్నారు.

Samantha

ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో సామ్ చైతు గురించి మరో విషయం హాట్ టాపిక్ గా మారింది. సమంత చైతన్య విడిపోవడానికి అసలు కారణం ఆమె అంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. నాగార్జున సొంత సోదరి కుమార్తె అయిన సుప్రియ యార్లగడ్డ వల్లనే సమంత, చైతన్య విడిపోయారని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వార్తలు రాస్తూ ప్రచారం చేస్తున్నారు.

నాగ చైతన్యకు సుప్రియ వరసకు మరదలు అవుతుంది. వీరిద్దరి మధ్య చిన్నప్పటినుంచి మంచి స్నేహ బంధం ఉంది. దీనితో ఎవరికి తోచినట్లు వారు వార్తలు రాసే పడేస్తున్నారు. దీని కోసం ఓ అద్భుతమైన కథ కూడా అల్లేశారు. సుప్రియ యంగ్ హీరో అడవి శేషు ప్రేమించుకొని, పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే ముందు నుంచి కూడా సుప్రియకు, సమంతకు పడదు. అందుకే ఈ పెళ్లి జరగకూడదు అని సమంత అడ్డుపడిందని.. అదే శేషుతో దూరానికి కారణమైందని, సమంత చివరకు వాళ్ళ పెళ్లి పెటాకులు అయ్యేలా చేసిందని.. ఈ కారణం వలనే సుప్రియ కూడా ఈ కక్ష మనసులో పెట్టుకుని చైతన్య, సమంత మధ్యలో విభేదాలు వచ్చేలా చేసిందంటూ వార్తలు ప్రచారం చేస్తున్నారు. వీటిలో నిజం ఎంత ఉంద‌న్న విష‌యం తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

బంగ్లాదేశ్‌కు ఐసీసీ షాక్.. టీ20 వరల్డ్ కప్ నుంచి అవుట్! స్కాట్లాండ్‌కు బంపర్ ఆఫర్..

భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…

Saturday, 24 January 2026, 5:25 PM

BSSC ఇంటర్ లెవల్ నోటిఫికేషన్ 2026: అభ్యర్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు గడువు పొడిగింపు!

బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…

Saturday, 24 January 2026, 10:15 AM

రాయ్‌పూర్ టీ20: కివీస్‌పై భారత్ ఘనవిజయం.. సిరీస్‌లో 2-0 ఆధిక్యం!

రాయ్‌పూర్ వేదికగా జ‌రిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ ల‌క్ష్యాన్ని…

Friday, 23 January 2026, 10:53 PM

పప్పులను వండే ముందు నానబెడుతున్నారా? లేదంటే డేంజరే.. న్యూట్రిషనిస్ట్ చెబుతున్న షాకింగ్ నిజాలు!

భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…

Friday, 23 January 2026, 8:02 PM

విశ్లేషణ: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు స్వయంకృతాపరాధం.. పాక్ మాటలు నమ్మి వరల్డ్ కప్‌కు దూరం?

ఎదుటి వ్య‌క్తి క‌ష్టాల్లో ఉంటే అత‌ని ప‌రిస్థితిని కొంద‌రు త‌మ‌కు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆస‌రాగా చేసుకుని త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాలు…

Friday, 23 January 2026, 3:54 PM

మీ పాన్ కార్డు పోయిందా? స్మార్ట్‌ఫోన్‌లోనే ‘ఇ-పాన్’ డౌన్‌లోడ్ చేసుకోండి.. పూర్తి ప్రాసెస్ ఇదే!

ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…

Friday, 23 January 2026, 9:51 AM

అల్లు అర్జున్ పోస్ట్‌పై నయనతార ఇంట్రెస్టింగ్ రియాక్షన్.. మెగాస్టార్ సినిమాపై ‘పుష్ప’రాజ్ పోస్ట్ వైరల్!

మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…

Thursday, 22 January 2026, 4:46 PM

కేవలం రూ.9,699కే 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. బ్లౌపంక్ట్ నుంచి అదిరిపోయే లాంచ్!

బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…

Thursday, 22 January 2026, 1:51 PM