Sajjanar : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఎంతో చురుగ్గా వ్యవహరిస్తూ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ప్రయాణికులను ఆకట్టుకునేందుకు అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. వీలు కుదిరినప్పుడల్లా ఆయనే స్వయంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ.. ప్రచారం కల్పిస్తున్నారు.
ఇక మొన్నీ మధ్యే అల్లు అర్జున్ నటించిన ఓ ట్యాక్సీ కంపెనీకి చెందిన యాడ్ ఆర్టీసీని కించ పరిచేలా ఉందంటూ ఆ సంస్థకు, అల్లు అర్జున్కు లీగల్ నోటీసులను పంపారు. దీంతో వారు క్షమాపణలు చెప్పి ఆ యాడ్ను తొలగించారు.
కాగా సజ్జనార్ తాజాగా మరోమారు ఓ సినిమాలోని సీన్ను షేర్ చేసి ఆకట్టుకున్నారు. హీరో నాని, హీరోయిన్ సాయి పల్లవి నటించిన ఎంసీఏ చిత్రంలోని సీన్ను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు. అందులో సాయిపల్లవి రన్నింగ్లో ఉన్న బస్సు ఎక్కుతుంటుంది. ఆ సీన్ను షేర్ చేస్తూ ఆయన.. బస్సు ఆగిన తరువాతే ఎక్కాలి, రన్నింగ్లో ఉన్నప్పుడు ఎక్కకూడదు.. అంటూ సందేశం ఇచ్చారు. ఆయన చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…