Cyber Fraud : సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. వారికి ఎట్టి పరిస్థితిలోనూ ఓటీపీలు, గట్రా చెప్పకూడదని పోలీసులు ఓ వైపు ఎంత హెచ్చరిస్తున్నా.. కొందరు మాత్రం వారి మాటలను పెడచెవిన పెడుతున్నారు. దీంతో సైబర్ నేరగాళ్ల బారిన పడి రూ.లక్షలు పోగొట్టుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. అయినప్పటికీ కొందరు ఇంకా మోసపోతూనే ఉన్నారు. తాజాగా ఓ వ్యక్తి సైబర్ నేరగాళ్ల బారిన పడ్డాడు. తక్కువ ధరకే మీల్స్ అంటే ఆశ పడి ఆర్డర్ చేశాడు. రూ.1 లక్ష మేర పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ముంబైలోని ఖార్ అనే ప్రాంతంలో నివాసం ఉండే ఎన్డీ నంద్ (74) జనవరి 19వ తేదీన ఫేస్బుక్లో ఓ యాడ్ చూశాడు. అందులో కేవలం రూ.100 చెల్లిస్తే 3 మీల్స్ పొందవచ్చు అని ఉంది. దీంతో వెంటనే అందులో ఇచ్చిన కాంటాక్ట్ నంబర్కు కాల్ చేశాడు. అవతలి వ్యక్తులు ఫోన్ లిఫ్ట్ చేసి ముందుగా రూ.10 చెల్లించాలని.. మిగిలిన రూ.90 లను మీల్స్ డెలివరీ సమయంలో క్యాష్ రూపంలో చెల్లించాలని చెప్పారు.
ఈ క్రమంలోనే ఆ వివరాలను నమ్మిన నంద్ వెంటనే తన క్రెడిట్ కార్డు వివరాలను అవతలి వ్యక్తికి చెప్పాడు. వారు ఆ కార్డుతో రెండు దఫాలుగా ట్రాన్సాక్షన్ చేశారు. ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా వారు అడిగినట్లు వారికి నంద్ ఓటీపీ చెప్పాడు. దీంతో 2 దఫాల్లో మొత్తం రూ.99,520 లను దుండగులు కాజేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన నంద్ వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఎట్టి పరిస్థితిలోనూ ఎవరికీ ఓటీపీలు, పిన్ నంబర్లు, పాస్ వర్డ్లను చెప్పకూడదని.. పోలీసులు మరోమారు హెచ్చరించారు.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…