Bahubali Netflix Series : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి రెండు సినిమాలు సృష్టించిన కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ను సెట్ చేసింది. దీంతో ఈ మూవీలకు ప్రీక్వెల్గా ఓ సిరీస్ను తీయాలని అప్పట్లో నిర్ణయించారు. నెట్ఫ్లిక్స్ ఈ భారీ ప్రాజెక్టుకు పూనుకుంది. అయితే తాజాగా ఈ సిరీస్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసలు అన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ ఈ సిరీస్ను ఎందుకు రద్దు చేశారని.. ప్రేక్షకులు సమాధానాల కోసం వెదుకుతున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. రచయిత ఆనంద్ నీలకంఠన్.. ది రైజ్ ఆఫ్ శివగామిని రచించారు. బాహుబలి మొదటి పార్ట్కు 40 ఏళ్ల ముందు అసలు ఏం జరిగింది ? అన్న వివరాలు ఆ కథలో ఉంటాయి. అందులో ప్రధానంగా శివగామి, కట్టప్పల మధ్య ప్రేమ కథ, మాహిష్మతి సామ్రాజ్యం గురించిన ముఖ్యమైన విశేషాలు.. ఉన్నాయి. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ దీన్ని.. బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ పేరిట సిరీస్లా తీయాలని భావించింది.
అయితే తాజాగా ఈ సిరీస్ను రద్దు చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై రూ.150 కోట్ల మేర ఖర్చు పెట్టారని సమాచారం. అయినప్పటికీ నెట్ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టును రద్దు చేయాలనే ముందుకు సాగింది.
అయితే ఈ సిరీస్ గురించి రాజమౌళి ఇప్పటి వరకు పట్టించుకోలేదట. నిర్మాత శోభు యార్లగడ్డ.. రాజమౌళిని ఒప్పించడంలో ఫెయిల్ అయినట్లు తెలిసింది. రాజమౌళి అసలు ఏమాత్రం ఈ ప్రాజెక్టు వైపు చూడలేదట. ఇక దేవా కట్టా, ప్రవీణ్ సత్తారులు వెబ్ సిరీస్ను తీసి ఫస్ట్ కాపీని సిద్ధం చేసినా నెట్ఫ్లిక్స్కు అది ఏమాత్రం నచ్చలేదట. మరోవైపు రాజమౌళి పట్టించుకోలేదు. అందువల్లే ఇకపై ఈ ప్రాజెక్టును ముందుకు కొనసాగించలేమని భావించిన నెట్ ఫ్లిక్స్ రూ.150 కోట్లు పెట్టినప్పటికీ ఈ ప్రాజెక్టును రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది.
అయితే రాజమౌళి ఈ సిరీస్ గురించి పట్టించుకుని కాస్తంత శ్రద్ధ వహించి ఉంటే ఈ సిరీస్ ఇప్పటికే రిలీజ్ అయి ఉండేదని అంటున్నారు. అసలు రాజమౌళి దీని గురించి ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావడం లేదని పలువురు అంటున్నారు. మరి దీనిపై రాజమౌళి స్పందిస్తారో లేదో చూడాలి..!
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…