Bahubali Netflix Series : ఇండియన్ బాక్సాఫీస్ వద్ద బాహుబలి రెండు సినిమాలు సృష్టించిన కలెక్షన్ల సునామీ అంతా ఇంతా కాదు. బాహుబలి సినిమా భారతీయ చిత్ర పరిశ్రమలో ఒక ట్రెండ్ను సెట్ చేసింది. దీంతో ఈ మూవీలకు ప్రీక్వెల్గా ఓ సిరీస్ను తీయాలని అప్పట్లో నిర్ణయించారు. నెట్ఫ్లిక్స్ ఈ భారీ ప్రాజెక్టుకు పూనుకుంది. అయితే తాజాగా ఈ సిరీస్ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో అసలు అన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ ఈ సిరీస్ను ఎందుకు రద్దు చేశారని.. ప్రేక్షకులు సమాధానాల కోసం వెదుకుతున్నారు.
ఇక అసలు విషయానికి వస్తే.. రచయిత ఆనంద్ నీలకంఠన్.. ది రైజ్ ఆఫ్ శివగామిని రచించారు. బాహుబలి మొదటి పార్ట్కు 40 ఏళ్ల ముందు అసలు ఏం జరిగింది ? అన్న వివరాలు ఆ కథలో ఉంటాయి. అందులో ప్రధానంగా శివగామి, కట్టప్పల మధ్య ప్రేమ కథ, మాహిష్మతి సామ్రాజ్యం గురించిన ముఖ్యమైన విశేషాలు.. ఉన్నాయి. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ దీన్ని.. బాహుబలి: బిఫోర్ ది బిగినింగ్ పేరిట సిరీస్లా తీయాలని భావించింది.
అయితే తాజాగా ఈ సిరీస్ను రద్దు చేస్తున్నట్లు నెట్ఫ్లిక్స్ ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుపై రూ.150 కోట్ల మేర ఖర్చు పెట్టారని సమాచారం. అయినప్పటికీ నెట్ఫ్లిక్స్ ఈ ప్రాజెక్టును రద్దు చేయాలనే ముందుకు సాగింది.
అయితే ఈ సిరీస్ గురించి రాజమౌళి ఇప్పటి వరకు పట్టించుకోలేదట. నిర్మాత శోభు యార్లగడ్డ.. రాజమౌళిని ఒప్పించడంలో ఫెయిల్ అయినట్లు తెలిసింది. రాజమౌళి అసలు ఏమాత్రం ఈ ప్రాజెక్టు వైపు చూడలేదట. ఇక దేవా కట్టా, ప్రవీణ్ సత్తారులు వెబ్ సిరీస్ను తీసి ఫస్ట్ కాపీని సిద్ధం చేసినా నెట్ఫ్లిక్స్కు అది ఏమాత్రం నచ్చలేదట. మరోవైపు రాజమౌళి పట్టించుకోలేదు. అందువల్లే ఇకపై ఈ ప్రాజెక్టును ముందుకు కొనసాగించలేమని భావించిన నెట్ ఫ్లిక్స్ రూ.150 కోట్లు పెట్టినప్పటికీ ఈ ప్రాజెక్టును రద్దు చేయాలనే నిర్ణయం తీసుకుంది.
అయితే రాజమౌళి ఈ సిరీస్ గురించి పట్టించుకుని కాస్తంత శ్రద్ధ వహించి ఉంటే ఈ సిరీస్ ఇప్పటికే రిలీజ్ అయి ఉండేదని అంటున్నారు. అసలు రాజమౌళి దీని గురించి ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావడం లేదని పలువురు అంటున్నారు. మరి దీనిపై రాజమౌళి స్పందిస్తారో లేదో చూడాలి..!
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…