Sai Pallavi : ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ.. సాయి పల్లవి. అయితే ఈమె అంతకు ముందే తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఈటీవీలో ప్రసారం అయిన ఢీ షోలో అప్పట్లో సాయి పల్లవి తన డ్యాన్స్తో ఎంతగానో ఆకట్టుకుంది. తరువాత సినిమాల్లోకి వచ్చింది. ఈమె నటించిన తొలి సినిమా కస్తూరి మాన్. తమిళంలో వచ్చింది. అయితే ఫిదా ద్వారా టాలీవుడ్కు పరిచయం అయి ఈమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తరువాత కూడా ఈమెకు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
తెలుగుతోపాటు మళయాళం, తమిళ భాషలకు చెందిన సినిమాల్లోనూ ఈమె నటిస్తోంది. అయితే సాయి పల్లవి గ్లామర్ షోకు దూరం. తాను తన సహజసిద్ధమైన అందాన్నే ఇష్టపడతానని చెప్పింది. అందుకనే తాను ముఖానికి ఎలాంటి క్రీములను రాయనని చెప్పేసింది. ఇక తన కెరీర్ మొదట్లో ముఖంపై మొటిమలు బాగా ఉండేవని.. హీరోయిన్లు చాలా అందంగా కనిపిస్తారని.. కానీ తన ముఖంపై మొటిమలు ఉన్న కారణంగా భయపడ్డానని.. తనను ప్రేక్షకులు ఏమైనా అంటారేమోనని కంగారు ఉండేదని.. సాయిపల్లవి తెలియజేసింది.
అయితే తన సినిమాలు చూశాక ప్రేక్షకులు తనను ఆదరించారని సాయిపల్లవి తెలిపింది. దీంతో వారు అందానికి కాకుండా నటనకే ప్రాధాన్యతను ఇస్తారనే విషయాన్ని తెలుసుకున్నానని చెప్పింది. కనుకనే తాను సహజసిద్ధంగా ఉండేందుకే ప్రయత్నిస్తానని తెలియజేసింది. ఇక సాయిపల్లవి ఫెయిర్నెస్ క్రీములకు చెందిన యాడ్స్లోనూ అందుకనే నటించనని చెప్పింది. సహజసిద్ధమైన అందానికే ప్రాధాన్యతను ఇస్తా కనుక తాను అలాంటి యాడ్స్ను ఎంత ఇచ్చినా చేయలేనని ఈమె గతంలోనే ఖరాఖండిగా చెప్పేసింది. అందుకనే ఈమెకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. అయితే సాయిపల్లవి మొటిమలకు చెందిన విషయం ఇప్పటికీ ఇంకా చాలా మందికి తెలియదు. కానీ దాని వెనుక పైన చెప్పిన విధంగా విషయం చాలానే ఉంది. ఏది ఏమైనా.. ఆమె పాటిస్తున్న విలువలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…
బ్లౌపంక్ట్ తన స్మార్ట్ టీవీ శ్రేణిని మరింత విస్తరిస్తూ, జియోటెలీ ఓఎస్ ఆధారిత తొలి 32 అంగుళాల స్మార్ట్ టీవీని…