Sai Pallavi : ఫిదా సినిమాలో భానుమతి పాత్రతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ.. సాయి పల్లవి. అయితే ఈమె అంతకు ముందే తెలుగు ప్రేక్షకులకు తెలుసు. ఈటీవీలో ప్రసారం అయిన ఢీ షోలో అప్పట్లో సాయి పల్లవి తన డ్యాన్స్తో ఎంతగానో ఆకట్టుకుంది. తరువాత సినిమాల్లోకి వచ్చింది. ఈమె నటించిన తొలి సినిమా కస్తూరి మాన్. తమిళంలో వచ్చింది. అయితే ఫిదా ద్వారా టాలీవుడ్కు పరిచయం అయి ఈమె ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక ఆ తరువాత కూడా ఈమెకు పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
తెలుగుతోపాటు మళయాళం, తమిళ భాషలకు చెందిన సినిమాల్లోనూ ఈమె నటిస్తోంది. అయితే సాయి పల్లవి గ్లామర్ షోకు దూరం. తాను తన సహజసిద్ధమైన అందాన్నే ఇష్టపడతానని చెప్పింది. అందుకనే తాను ముఖానికి ఎలాంటి క్రీములను రాయనని చెప్పేసింది. ఇక తన కెరీర్ మొదట్లో ముఖంపై మొటిమలు బాగా ఉండేవని.. హీరోయిన్లు చాలా అందంగా కనిపిస్తారని.. కానీ తన ముఖంపై మొటిమలు ఉన్న కారణంగా భయపడ్డానని.. తనను ప్రేక్షకులు ఏమైనా అంటారేమోనని కంగారు ఉండేదని.. సాయిపల్లవి తెలియజేసింది.
అయితే తన సినిమాలు చూశాక ప్రేక్షకులు తనను ఆదరించారని సాయిపల్లవి తెలిపింది. దీంతో వారు అందానికి కాకుండా నటనకే ప్రాధాన్యతను ఇస్తారనే విషయాన్ని తెలుసుకున్నానని చెప్పింది. కనుకనే తాను సహజసిద్ధంగా ఉండేందుకే ప్రయత్నిస్తానని తెలియజేసింది. ఇక సాయిపల్లవి ఫెయిర్నెస్ క్రీములకు చెందిన యాడ్స్లోనూ అందుకనే నటించనని చెప్పింది. సహజసిద్ధమైన అందానికే ప్రాధాన్యతను ఇస్తా కనుక తాను అలాంటి యాడ్స్ను ఎంత ఇచ్చినా చేయలేనని ఈమె గతంలోనే ఖరాఖండిగా చెప్పేసింది. అందుకనే ఈమెకు ఎంతో మంది అభిమానులు ఏర్పడ్డారు. అయితే సాయిపల్లవి మొటిమలకు చెందిన విషయం ఇప్పటికీ ఇంకా చాలా మందికి తెలియదు. కానీ దాని వెనుక పైన చెప్పిన విధంగా విషయం చాలానే ఉంది. ఏది ఏమైనా.. ఆమె పాటిస్తున్న విలువలకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…