Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్కి కొద్ది రోజుల క్రితం ఊహించని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వినాయక చవితి రోజు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా స్టోర్ వైపు వెళుతోన్న సమయంలో ఒక్కసారిగా బైక్ పై నుంచి స్కిడ్ అయిన తేజ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో తేజూని గుర్తించిన స్థానికులు మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం అపోలో హాస్పిటల్లో చేర్పించారు. సుమారు నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న తేజ్ దసరా రోజు డిశ్చార్జ్ అయ్యారు.
సాయితేజ్ ప్రస్తుతం ఇంటి గ్గరే ఉంటూ ప్రత్యేక డైట్ తీసుకుంటున్నారు. గాయాల బారి నుంచి సాయి తేజ్ పూర్తిగా కోలుకుని ఇప్పుడు నార్మల్ కండిషన్లో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేక నిపుణుల సమక్షంలో ఫిజియో థెరపీతోపాటు స్పీచ్ థెరపీ అందిస్తున్నారట. బాడీ మొత్తం ఇప్పుడిప్పుడే పూర్తి కండిషన్ లోకి వస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం ఎవరినీ పెద్దగా కలవకుండా రెస్ట్ తీసుకుంటున్నారు. గాయాలు అయితే మానాయి కానీ ట్రీట్మెంట్ వల్ల ఆయన బాడీలో పలు చేంజెస్ వచ్చాయట. వాటిపై కూడా కొద్దిగా శ్రద్ధ పెడుతున్నాడట తేజు. మరి కొద్ది రోజులలో ఆయన పూర్తిగా కోలుకోనున్నట్టు సమాచారం. దేవాకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రిపబ్లిక్’ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. మరికొద్ది రోజుల్లో తన కెరీర్లో రాబోతున్న 15వ చిత్ర షూటింగ్లో జాయిన్ కానున్నారట తేజ్.
అయితే యాక్సిడెంట్ కాకముందు తేజ్ బరువు బాగా ఉండేవారు. కానీ ప్రస్తుతం చాలా సన్నగా అయిపోయాడని టాక్ వినిపిస్తోంది. అందువల్లే ఆయన ఫొటోలను బయటకు విడుదల చేయడం లేదని తెలుస్తోంది. త్వరలోనే ఓ మాదిరి ఆకృతిలోకి వచ్చాక తేజ్ బయట కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ యాక్సిడెంట్ వల్ల సాయిధరమ్ తేజ్ శరీరం పూర్తిగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…