Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్కి కొద్ది రోజుల క్రితం ఊహించని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. వినాయక చవితి రోజు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఐకియా స్టోర్ వైపు వెళుతోన్న సమయంలో ఒక్కసారిగా బైక్ పై నుంచి స్కిడ్ అయిన తేజ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో తేజూని గుర్తించిన స్థానికులు మెడికవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం అపోలో హాస్పిటల్లో చేర్పించారు. సుమారు నెలరోజుల పాటు చికిత్స తీసుకున్న తేజ్ దసరా రోజు డిశ్చార్జ్ అయ్యారు.
సాయితేజ్ ప్రస్తుతం ఇంటి గ్గరే ఉంటూ ప్రత్యేక డైట్ తీసుకుంటున్నారు. గాయాల బారి నుంచి సాయి తేజ్ పూర్తిగా కోలుకుని ఇప్పుడు నార్మల్ కండిషన్లో ఉన్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రత్యేక నిపుణుల సమక్షంలో ఫిజియో థెరపీతోపాటు స్పీచ్ థెరపీ అందిస్తున్నారట. బాడీ మొత్తం ఇప్పుడిప్పుడే పూర్తి కండిషన్ లోకి వస్తోందని అంటున్నారు.
ప్రస్తుతం ఎవరినీ పెద్దగా కలవకుండా రెస్ట్ తీసుకుంటున్నారు. గాయాలు అయితే మానాయి కానీ ట్రీట్మెంట్ వల్ల ఆయన బాడీలో పలు చేంజెస్ వచ్చాయట. వాటిపై కూడా కొద్దిగా శ్రద్ధ పెడుతున్నాడట తేజు. మరి కొద్ది రోజులలో ఆయన పూర్తిగా కోలుకోనున్నట్టు సమాచారం. దేవాకట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన ‘రిపబ్లిక్’ సినిమా విడుదలై ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన అందుకుంది. మరికొద్ది రోజుల్లో తన కెరీర్లో రాబోతున్న 15వ చిత్ర షూటింగ్లో జాయిన్ కానున్నారట తేజ్.
అయితే యాక్సిడెంట్ కాకముందు తేజ్ బరువు బాగా ఉండేవారు. కానీ ప్రస్తుతం చాలా సన్నగా అయిపోయాడని టాక్ వినిపిస్తోంది. అందువల్లే ఆయన ఫొటోలను బయటకు విడుదల చేయడం లేదని తెలుస్తోంది. త్వరలోనే ఓ మాదిరి ఆకృతిలోకి వచ్చాక తేజ్ బయట కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కానీ యాక్సిడెంట్ వల్ల సాయిధరమ్ తేజ్ శరీరం పూర్తిగా మారిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…