Sai Dharam Tej : సెప్టెంబర్ 10వ తేదీన హైదరాబాద్ లోని కేబుల్ బ్రిడ్జి దగ్గర సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అతనికి కాలర్ బోన్ సర్జరీ చేయడంతో కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని వైద్యులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగుందని వెంటిలేటర్ సహాయం లేకుండా కోలుకుంటున్నాడు.. అంటూ కుటుంబ సభ్యులు వెల్లడించారు. సాయి తేజ్ ను చూడటానికి వెళ్ళిన వారు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.
తాజాగా సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. సాయి తేజ్ ఇప్పటికీ కళ్ళు తెరవలేదని చేసిన వ్యాఖ్యలు కొంత వరకు అభిమానులకు కంగారు పుట్టించాయి. ఇంతవరకు తన ఆరోగ్యం బాగుందని కోలుకుంటున్నారని చెప్పగా పవన్ కళ్యాణ్ మాత్రం సాయి ధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే ఉన్నాడని కళ్ళు కూడా తెరవలేదు అని చెప్పడంతో అతని ఆరోగ్యం గురించి అభిమానులు కొంత ఆందోళన వ్యక్తం చేశారు.
తాజాగా రిపబ్లిక్ సినిమా దర్శకుడు దేవకట్టా.. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య విషయంపై స్పందిస్తూ అతని ఆరోగ్యం బాగుందని, అతనిని కలిసి ఈ సినిమాను అక్టోబర్ 1వ తేదీ విడుదల చేయాలని అడగగా అతను ఓకే చెప్పినప్పుడే ఈ సినిమాను విడుదల చేయాలని భావించామని, ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను సాయిధరమ్ తేజ్ చూశాడని.. దేవకట్టా చెప్పడంతో అభిమానులలో ఆందోళన పెరిగింది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా సాయి ధరమ్ తేజ ఆరోగ్యం గురించి మాట్లాడుతుంటే అసలు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య విషయంలో ఏదో దాస్తున్నారని.. ఆయన ఆరోగ్యం గురించి నిజం చెప్పాలని అభిమానులు ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను కోరుతున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…