Sai Dharam Tej : మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు గతేడాది హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై యాక్సిడెంట్ అయిన విషయం విదితమే. యాక్సిడెంట్లో భాగంగా తేజ్కు కాలర్ బోన్ విరిగింది. దీంతో సుదీర్ఘకాలం పాటు హాస్పిటల్లో ఉండి చికిత్స తీసుకున్నాడు. తరువాత ఒకటి రెండు సార్లు మెగా ఫ్యామిలీ వేడుకల్లో కనిపించాడు. అయితే ఈ మధ్య సాయిధరమ్ తేజ్ అసలు బయట కనిపించడం లేదు. దీంతో ఆయనకు ఏమైందోనని ఫ్యాన్స్ మళ్లీ ఆందోళన చెందుతున్నారు.
సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్లో యాక్టివ్గా ఉన్నట్లు ఆయన ట్వీట్లను చూస్తే అర్థమవుతుంది. అయితే అవి ఆయన వ్యక్తిగత విషయాలకు చెందిన ట్వీట్లు కావు. ఇతర సినిమాలకు చెందిన చిత్ర యూనిట్లు, హీరోలకు ఆయన శుభాకాంక్షలు చెబుతూ చేసిన ట్వీట్లు. ఆయన తన ఫొటోలను మాత్రం పెట్టడం లేదు. దీంతో ఆయనకు మళ్లీ ఏమైనా అయిందా.. అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కాగా సాయి ధరమ్ తేజ్ త్వరలో ఓ తమిళ రీమేక్ మూవీలో నటించనున్నట్లు తెలిసింది. అందులో పవన్ కల్యాణ్ కూడా నటిస్తారని సమాచారం. ఆ మూవీలో పవన్ది గెస్ట్ రోల్ మాత్రమేనని తెలిసింది. దీనిపై త్వరలోనే అధికారికంగా వివరాలను ప్రకటిస్తారని సమాచారం.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…