Jabardasth : ప్రముఖ నటి, ఎమ్మెల్యే రోజా తెలుగు సినిమాల్లో హీరోయిన్గా నటించి అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించి అక్కడ కూడా తనదైన శైలిలో రాజకీయం చేస్తూ.. ప్రజలకు సేవలందిస్తూ.. రాజకీయ నాయకురాలిగా అదరగొడుతోంది. మరోవైపు జబర్దస్త్ కామెడీ షో వంటి ప్రోగ్రామ్లకు జడ్జ్గా బాధ్యతలు నిర్వహిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ విషయాలు కూడా తెలియజేస్తూ అలరిస్తూ ఉంటుంది. అయితే వెండితెరకు దూరంగా ఉన్న రోజా బుల్లితెరపై మాత్రమే అలరిస్తూ వస్తోంది. ముఖ్యంగా జబర్దస్త్కి జడ్జ్గా సత్తా చాటుతోంది.
నాగబాబు వెళ్లిపోయిన తర్వాత రోజానే జబర్దస్త్కి మెయిన్ పిల్లర్గా మారింది. అయితే గత కొద్ది రోజులుగా రోజా జబర్దస్త్ నుండి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. రీసెంట్గా మల్లెమాల ఎంటర్టైనమెంట్స్ రిలీజ్ చేసిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమో చూస్తే రోజా ఇకపై జబర్దస్త్లో జడ్జిగా కాకుండా.. ఏపీ మంత్రివర్గంలో క్యాబినెట్ హోదాలో కనిపించబోతుందని పక్కాగా అర్ధమవుతోంది. అందుకే ఎన్నో సంవత్సరాలుగా తాను జడ్జిగా వ్యవహరిస్తున్న టాప్ టీవీ షోకి తాను తప్పుకొని కొత్త జడ్జిలకు ట్రైనింగ్ ఇస్తున్నట్లుగా ఉంది ప్రోమో. తనకు ఎంతో పేరు, గుర్తింపు తెచ్చిన ఎంటర్టైనమెంట్ ప్రోగ్రామ్ నుంచి రోజా తప్పుకోవడం చూస్తుంటే ఏపీ మంత్రిగా కన్ఫామ్ అయిందని ఫ్యాన్స్, టీవీలు చూస్తున్న ప్రేక్షకులు కూడా భావిస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న కేబినెట్ మంత్రుల్లో మెజార్టీ సభ్యులను తప్పించి కొత్తవారికి చోటు కల్పించబోతున్నట్టు ఏపీ సీఎం జగన్ స్వయంగా ప్రకటించారు. మహిళా కోటాలో తనకు మంత్రి పదవి దక్కితే ఈ షోలను మానేయాల్సి వస్తుందని తెలిసి.. ఇప్పటి నుంచి రోజా దూరంగా ఉంటుందని తెలుస్తోంది. అందుకే ఈ వారం జరిగిన ఎపిసోడ్లో కూడా రోజా కనిపించలేదేమోనని చర్చ మొదలయింది. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందనేది త్వరలో తెలియనుంది. రోజా కూడా జబర్దస్త్ నుండి తప్పుకుంటే ఆ కళే పోతుందని కొందరు అంటున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…