Naga Shourya : టాలీవుడ్ గ్లామర్ హీరో నాగ శౌర్య గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. కెరీర్లో విభిన్న కథా చిత్రాలు చేస్తున్నా కూడా మంచి హిట్స్ పడడం లేదు. ఛలో సినిమా నాగ శౌర్య కెరీర్లో పెద్ద హిట్గా నిలిచింది.చందమామ కథలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు నాగశౌర్య. అయితే ఈ సినిమాతో ఆయనకు తెలుగులో ఎటువంటి గుర్తింపు రాలేదు. అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమా ప్రేక్షకులకి దగ్గరయ్యేలా చేసింది. మంచి కథలని ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్న నాగ శౌర్యకు సరైన విజయం అయితే దక్కడం లేదు.
అయితే నాగశౌర్య.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి బంధువు అని ఎప్పటి నుండో పలు వార్తలు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి. గతంలో దీనిపై నాగ శౌర్య సమాధానం ఇచ్చాడు. నాకు, జూనియర్ ఎన్టీఆర్ కి ఎటువంటి రిలేషన్ లేదు. నేను ఎన్టీఆర్ కి అందరిలాగే అభిమానినే, కానీ అతనితో ఎటువంటి సంబంధం లేదు. చిత్ర పరిశ్రమలో నటుడికి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా అది వారికి అంతగా ఉపయోగపడదు.. అని చెప్పాడు నాగాశౌర్య. అయితే తాజాగా ఇదే విషయంపై శౌర్య తల్లి ఉష స్పందించారు.
ఎన్టీఆర్ తమ బంధువు కాదని ఉష వెల్లడించారు. ఎన్టీఆర్ భార్య.. ప్రణతి కజిన్ శౌర్యకి సన్నిహితురాలు. అలాగే ఆమె తండ్రికి తన కొడుకు గురించి కూడా బాగా తెలుసు . అంతే తప్ప ఎన్టీఆర్తో తమకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం ఫ్యామిలీ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చింది. నాగ శౌర్య తన కెరీర్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు . ఆఫ్ స్క్రీన్కి భిన్నమైన వ్యక్తిగా పేరు పొందాడు. అతను షూటింగ్కి సెల్ఫోన్ను కూడా తీసుకెళ్లడు. ఈ విషయం గురించి తల్లే చెప్పింది. చాలా పద్దతిగా ఉంటూ ప్రశంసలు పొందే నాగ శౌర్యకి ఇటీవలి కాలంలో హిట్ అనేది అందని ద్రాక్ష అయింది.
ఇటీవలే లక్ష్య, వరుడు కావలెను వంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శౌర్య. తాజాగా ఈ యంగ్ హీరో మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్పై సంతకం చేశాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) పతాకంపై ప్రొడక్షన్ నం.6గా సుధాకర్ చెరుకూరి నిర్మించబోయే కొత్త చిత్రాన్ని నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టితో చేయనున్నాడు. కమర్షియల్ సబ్జెక్ట్తో రూపొందనున్న ఈ చిత్రంలో నావల్పాయింట్ నాగ శౌర్యను ఆకట్టుకుంది. తెలుగు నూతన సంవత్సరం – ఉగాది సందర్భంగా శనివారం నాడు ప్రకటించబడిన ఈ చిత్రంలో నాగశౌర్య సరికొత్తగా కనిపించనున్నాడు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…