Roja : టాలీవుడ్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసింది నటి రోజా. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. అనంతరం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని పెంచుకుంది. పొలిటికల్ ఫీల్డ్ లో ఫైర్ బ్రాండ్ ఇమేజ్ రోజా సొంతం. రోజా రాజకీయ రంగంలో ఉంటూనే మరోపక్క బుల్లితెర షోస్ అయిన జబర్దస్త్ వంటి కామెడీ షోలలో జడ్జిగా కొన్ని సంవత్సరాలు పని చేసి ఫుల్ క్రేజ్ను సంపాదించుకుంది. రోజా మంత్రి అయ్యాక.. పూర్తి సమయాన్ని రాజకీయాలకు కేటాయించింది. అయితే రోజా ఎప్పుడూ తన ఫ్యామిలీ గురించి చెబుతూ నెట్టింట్లో పోస్టులు చేస్తుంటుంది.
ఇక రోజా తన కూతురు అన్షు మాలిక చిన్న వయసులో ఎంతో ఎత్తుకు ఎదిగింది. పుస్తకాలు రచిస్తోంది. ప్రపంచ స్థాయిలో అవార్డులు రివార్డులు అందుకుంటోంది. తనకు చేతనైన సాయం అందించడంలో అన్షు మాలిక ముందుంటుంది. ఓ ఇద్దరిని చదివిస్తోంది. ఇలా తన కూతురి గురించి చెబుతూ రోజా ఎంతో గర్వపడుతుంటుంది. అయితే శనివారం అన్షు మాలిక పుట్టిన రోజు. ఈ సందర్భంగా అన్షు మీద ప్రేమను కురిపించింది రోజా. డియర్ అన్షు.. నువ్వు నా కూతురివే కాదు.. మంచి ఫ్రెండ్వి.. నన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నందుకు థాంక్స్.. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అన్షు అంటూ ప్రేమగా పోస్ట్ వేసింది.
మామూలుగా అయితే ప్రతి ఏడాది గ్రాండ్గా బర్త్ డేను సెలెబ్రేట్ చేస్తుంటుంది రోజా. అయితే ఈ సారి మాత్రం సింపుల్గా తన కూతురికి విషెస్ చెప్పేసింది. అయితే రోజా కుమార్తె అన్షు మాలిక వెండి తెరంగ్రేటం చేయనుందని వార్తలు వస్తూనే ఉన్నాయి. అన్షును హీరోయిన్గా చేసేందుకు రోజా ప్రయత్నిస్తోందన్న వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. అన్షు మాలిక ఇప్పటికే యూఎస్ లోని ఫేమస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో సీటు రావడంతో అక్కడ శిక్షణ పొందుతోంది. అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఆమె సినిమా హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. రోజా కూతురు అన్షు సినిమా ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందో చూడాలి.
తాను మొదట్లో క్రికెటర్ అవుతానని అనుకోలేదని, భారత ఆర్మీలో చేరి సేవలందించాలని చిన్నతనం నుంచే కలలు కన్నానని, కానీ క్రికెట్లోకి…
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…