Puri Jagannadh Assistant Director : టాలీవుడ్ సెన్సేషల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. పూరీ జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తున్న సాయికుమార్ హైదరాబాద్ నగరంలోని మాదాపుర్ పోలీస్ స్టేషన్ పరిధి దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దుర్గం చెరువులో గుర్తు తెలియని యువకుడి మృతదేహం ఉన్నట్లు బుధవారం మాదాపూర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు.
ఈ ఘటనపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. అప్పుల బాధను తట్టుకోలేకే సాయికుమార్ ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. సాయికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన తర్వాతే అసలు కారణాలు తెలుస్తాయని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ వద్ద సాయికుమార్ పని చేస్తున్నాడా లేదా అనే కోణంపై దర్యాప్తు చేయవలసి ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు.
ఇటీవల విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో విడుదలైన లైగర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ తో అందరి అంచనాలను తారుమారు చేసింది. ఈ చిత్రం ఘోర పరాజయం కావడంతో పూరీ జగన్నాథ్ ని నిండా ముంచేసిందని చెప్పవచ్చు. ఇక విజయ్ దేవరకొండ కూడా ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గుర్తింపు వస్తుంది అని ఆశ పడ్డాడు. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో విజయ్ దేవరకొండ ఆశలన్నీ అడియాశలయ్యాయి.
లైగర్ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, చార్మి, కరణ్ జోహార్ ముగ్గురు సంయుక్తంగా నిర్మించారు. దీంతో వారు పెట్టిన పెట్టుబడి వృథా అయ్యింది. రూ.120 కోట్ల పెట్టుబడి పెట్టగా రూ.20 కోట్లు మాత్రమే కలెక్షన్ వసూలు చేసింది. ఇంకా రూ.70 కోట్లు వృథాగా పోయాయి. నిర్మాతలకు రూ.50 కోట్ల మేర నష్టం వచ్చినట్లు సినీ విశ్లేషక వర్గాల నుంచి టాక్ వినిపిస్తుంది. నిర్మాతలను కూడా ఈ చిత్రం భారీ నష్టాలతో నిలువునా ముంచేసింది.
మార్చి 4, 2026న హైదరాబాద్లో జరగనున్న తమ వివాహ రిసెప్షన్కు హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని నూతన…
టాలీవుడ్ నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు. గురువారం (ఫిబ్రవరి 26, 2026) రాజస్థాన్లోని…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి గాను…
టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ సూపర్ 8 దశలో వరుసగా రెండు మ్యాచ్లను ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన…
కొత్తగా రిలీజ్ అయ్యే ఏ సినిమా అయినా సరే కచ్చితంగా 8 వారాల తరువాతే ఓటీటీలోకి రావాలన్న నిబంధనపై ప్రస్తుతం…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని, యుక్త వయస్సులో ఉన్నవారికి క్యాన్సర్ ఎక్కువగా వస్తుందని, 5 రకాల…
ఈ నెల 26వ తేదీన రాజస్థాన్లోని ఉదయ్పూర్ ఐటీసీ మిమెంటోస్ రిసార్ట్లో వివాహం చేసుకోబోతున్న నటీనటులు విజయ్ దేవరకొండ, రష్మిక…
భారత అండర్ 19 క్రికెట్ జట్టు యువ కెరటం వైభవ్ సూర్యవంశీకి టాటా మోటార్స్ ఖరీదైన బహుమతిని అందజేసింది. రూ.22…