RGV : గత కొద్ది రోజులుగా మా ఎన్నికల హంగామా టాలీవుడ్లో నడుస్తున్న విషయం తెలిసిందే. పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒకరిపై ఒకరు అవాకులు చెవాకులు పేల్చుకున్నారు. లోకల్-నాన్ లోకల్, డబ్బుల పంపకం, కులాల ప్రస్తావన ఇలా ఎన్నో ప్రస్తావనకు వచ్చాయి. మోహన్ బాబు అయితే ఏకంగా చేయి చేసుకున్నారనే వార్తలు కూడా వినిపించాయి.
మా ఎలక్షన్స్లో మోహన్బాబు, నరేష్ భౌతిక దాడులకు దిగారని, బండబూతులు తిట్టారని ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సభ్యులు చెబుతున్నారు. ఏకంగా ప్రెస్మీట్ పెట్టిమరీ ఇదేవిషయం చెప్పారు. రాత్రి గెలిచాం.. ఉదయానికి ఓడిపోయాం.. అంటూ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. అయితే ‘మా’ సినిమా ఇంకా ముగియలేదు. వీలు చూసుకొని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు.
ఇదే సందులో రామ్ గోపాల్ వర్మ ‘మా’ పరిణామాలపై తన వెర్షన్ను ఒక్క మాటలో తేల్చేశారు. . ‘మా’ను సర్కస్ తో పోలుస్తూ ఓ ట్వీట్ వదిలారు. ‘‘మేమంతా ఓ సర్కస్ అని ప్రేక్షకులకు సినీ‘మా’ జనం మరోసారి నిరూపించారు’’ అని ట్వీట్ చేశారు. దీనిపై నెటిజన్లు చర్చకు తెరదీశారు. మెగా ఫ్యామిలీ గురించేనంటూ కొందరు, లేదూ నరేశ్ గురించే అంటూ మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ ట్వీట్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…