Akhil : అక్కినేని వారసుడు అఖిల్ లేటెస్ట్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. పూజా హెగ్దే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో అఖిల్ మాట్లాడుతూ ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. అమ్మకి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు నాన్న అమెరికాలో టెస్టులు చేయించారట.
అలా టెస్టులు చేశాక.. అక్కడి డాక్టర్లు కడుపులో ఉన్నది అమ్మాయని అన్నారట. ఆ మాట వినగానే నాన్న చాలా హ్యాపీగా ఫీలయ్యారని అఖిల్ అన్నారు. ఫస్ట్ నుండి నాన్నకి ఆడపిల్లలంటే ఇష్టం. అందుకే అమ్మాయే పుట్టాలని అనుకున్నారు. వెంటనే అమ్మాయికి సంబంధించిన డ్రెస్ లు కొనేశారట. అమ్మాయికి నికిత అనే పేరుని కూడా నాగ్ డిసైడ్ చేశారట. ఆఖరికి ఇండియాకి టికెట్స్ బుక్ చేసినప్పుడు నికిత అనే పేరుని ఎంటర్ చేశారట.
కానీ డెలివరీ అయ్యాక పుట్టింది అబ్బాయి అని తెలిసి.. నాగార్జున షాక్ అయ్యారని అఖిల్ తన మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ని షేర్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికి గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటారట. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా తర్వాత అఖిల్ ఏజెంట్ సినిమాలో వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం లుక్ పరంగా.. బాడీని బిల్డ్ చేయడానికి చాలా కష్టం అని అన్నారు. దాదాపు ఏడాదిన్నరగా వర్క్ చేశానని అన్నారు. ఈ లుక్ ఆడియన్స్ కి కచ్చితంగా నచ్చుతుందని అన్నారు. అలాగే సురేందర్ రెడ్డి టేకింగ్ కూడా అద్భుతంగా వస్తుందని అఖిల్ అన్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…