RGV fires on Garikapati : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకోసం ఆయన ఏదో ఒక విషయాన్ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అందులో భాగంగానే తాజాగా మరోసారి సంచలన ట్వీట్స్ తో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు ఆర్జీవి. ఈసారి ఆయన గరికిపాటి నరసింహారావుపై ట్విట్టర్ వేదికగా కొన్నికామెంట్స్ చేయడం మొదలుపెట్టారు.
ఇక అసలు వివరాల్లోకి వెళితే.. ఇటీవల అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి, చిరంజీవిని మధ్య ఓ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. అభిమానులతో చిరంజీవి ఫోటోలు దిగుతున్న సమయంలో గరికపాటి ఫోటో సెషన్ ఆపేస్తే తాను మాట్లాడుతానని, లేదంటే వెళ్లిపోతానని ఆ కార్యక్రమంలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిరంజీవి తమ్ముడు నాగబాబుతో సహా మెగా అభిమానులు సైతం గరికిపాటిపై సోషల్ మీడియాలో విమర్శలు చేశారు.
ఈ క్రమంలోనే తాజాగా ఈ వివాదంపై వివాదాలకు కెరాఫ్ అడ్రెస్ అయిన రామ్ గోపాల్ వర్మ స్పందించి చిరంజీవి ఏనుగు.. నువ్వు గరిక.. నీకు పద్మ అవార్డు కూడా ఎక్కువే అంటూ గరికపాటిని ఉద్దేశించి ఘాటుగా విమర్శించాడు. ప్రస్తుతం ఆర్జీవి చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఆర్జీవీ నాగబాబు చేసిన ట్వీట్ను రీట్వీట్ చేసి ఐ యాం సారీ నాగబాబు గారు.. మెగాస్టార్ ని అవమానించిన గుర్రం పాటిని క్షమించే ప్రసక్తే లేదు..
మా అభిమానుల దృష్టిలో చిరంజీవిని అవమానించిన వాడు మాకు గ(డ్డిప)రక తో సమానం, తగ్గేదేలే. హే గారికపీటి, బుల్లి బుల్లి ప్రవచనాల్లో నక్కి నక్కి దాక్కో, అంతే కాని పబ్లిసిటి కోసం ఫిల్మ్ ఇండస్ట్రీ మీద మొరగొద్దు. మెగాస్టార్ చిరంజీవి ఏనుగు.. నువ్వేంటో నీకు తెలివుందని అనుకుంటున్నావు కాబట్టి, నువ్వే తెలుసుకో అంటూ గరికపాటిని విమర్శించారు.
హే గూగురుపాటి నరసింహ రావు , తమరు గ(డ్డిప)రిక అయితే మా చిరంజీవి నరసింహ.. ఆ మిగిలిన రావుని మీ పంచ జేబులో పెట్టుకోండి . సర్ నాగబాబు గారు, ఆ గడ్డికి పద్మ కూడ ఎక్కువే, అలాంటప్పుడు పద్మశ్రీని ఎందుకు ఇచ్చారు సర్ అని ప్రశ్నించాడు వర్మ. సర్ నాగబాబు గారు, మీ అన్నయ్యని, ఆ గడ్డి అన్న మాటలకి, దాన్ని తినెయ్యకుండ వదిలెయ్యడం మీ సంస్కారం.. కానీ అభిమానులమైన మేము ఆ గ(డ్డిప)రిక ని మంటలలో మండించకపోతే ఆ గడ్డి నమ్మే అమ్మవారు కూడ మమ్మల్ని క్షమించరు ఆర్జీవి ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు. ఆర్జీవీ గరికిపాటిపై చేసిన ట్విట్టర్ కామెంట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…