Review Lakshman : నటుడు విశ్వక్ సేన్ తన సినిమా విడుదల సందర్భంగా మూవీని ప్రమోట్ చేసేందుకు చేసిన ప్రాంక్ వీడియో వ్యవహారం దెబ్బ కొట్టింది. ఆయనపై, అందులో నటించిన వారు.. దాన్ని చిత్రీకరించినవారిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ఈ విషయంలో యాంకర్ దేవికి, నటుడు విశ్వక్ సేన్కు మధ్య జరిగిన గొడవ చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే నెటిజన్లు విశ్వక్ సేన్కు మద్దతు తెలుపుతున్నారు. అయితే సదరు ప్రాంక్ వీడియోలో నటించిన రివ్యూయర్ లక్ష్మణ్ అసలు ఈ విషయంలో ఏం జరిగిందో చెప్పాడు.
విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా మే 6వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన, చిత్రయూనిట్.. రివ్యూయర్ లక్ష్మణ్ తో ప్రాంక్ వీడియో చేయించారు. అందులో లక్ష్మణ్ పెట్రోల్ డబ్బా పట్టుకుని వచ్చి ఒంటి మీద పోసుకుని సూసైడ్ చేసుకుని చనిపోతా అని చెప్తాడు. దీంతో విశ్వక్ సేన్ అడ్డుపడి సముదాయించి పంపించేస్తాడు. ఈ క్రమంలోనే ఈ వీడియో వెనుక అసలు ఏం జరిగిందో తెలియకపోవడంతో.. అందరూ ఇది నిజమే అని నమ్మారు. కానీ అసలు విషయం తెలిశాక ఇలా చేసినందుకు వారిపై నెటిజన్లు మండిపడ్డారు.
అయితే ఈ ప్రాంక్ వీడియో చేసిన లక్ష్మణ్ మాట్లాడుతూ.. మేం మూవీ ప్రమోషన్స్ మాత్రమే చేశాం.. డైరెక్షన్ టీం చెప్పినట్టే నేను చేశాను.. నేను పెట్రోల్ పోసుకున్నట్టు చేశా.. కానీ అందులో ఉన్నది పెట్రోల్ కాదు.. వాటర్.. అది జనానికి కూడా తెలుసు. మేం ఎవరికీ ఇబ్బంది లేకుండానే ఫ్రాంక్ వీడియో చేశాం.. అని అన్నాడు. అలాగే ఈ విషయంలో కేసులు అదీ ఇదీ అంటున్నారు.. బూతులు తిట్టిస్తున్నారు. ముందు వాళ్లపై కేసులు పెట్టాలి. ట్రాఫిక్కి కూడా మేం అభ్యంతరం కలిగించలేదు.. నిజంగానే ఎవరికైనా ఇబ్బంది కలిగించి ఉంటే క్షమాపణ కోరుతున్నాం.. మేం మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఫన్నీగా చేశాం. చాలామంది నెగెటివ్గా వీడియోలు చేస్తున్నారు. మేం అయితే ఏ తప్పు చేయలేదు.. అంటూ స్పష్టంగా చెప్పాడు. ఈ క్రమంలోనే లక్ష్మణ్ తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వివాదం ఎప్పటికి సద్దుమణుగుతుందో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…