Renu Desai : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ ఈ మధ్యకాలంలో తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఈ మధ్యే ఓ చోట కొబ్బరి బొండాలను తాగుతూ బొండాలను నేరుగా అలాగే తాగాలని.. ఎలాంటి స్ట్రాలను ఉపయోగించరాదని.. దీంతో పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుందని.. తెలియజేసింది. అయితే ఆమె పర్యావరణ ప్రేమికురాలు. అలాగే మూగజీవాల పట్ల జరిగే హింసపై కూడా స్పందిస్తుంటుంది. దీంతోపాటు అప్పుడప్పుడు తన కొడుకు అకీరా నందన్, కుమార్తె ఆద్యలకు చెందిన పోస్ట్లను పెడుతుంటుంది. ఈ క్రమంలోనే ఆమె పోస్టులు వైరల్ అవుతుంటాయి.
ఇటీవలే అకీరా నందన్ కు చెందిన గ్రాడ్యుయేషన్ డేలో ఆమె పాల్గొంది. ఆ కార్యక్రమానికి పవన్ కూడా హాజరు కావడం విశేషం. దీంతో చాలా రోజుల తరువాత వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్లో చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు. ఇక తాజాగా రేణు దేశాయ్ మరొక పోస్ట్ పెట్టింది. అదేమిటంటే.. అమెరికాలో సన్ స్క్రీన్ లోషన్స్ను ఎక్కువగా వాడుతున్నారని.. అయితే వారిలో చాలా మంది చర్మ క్యాన్సర్ బారిన పడుతున్నారని తెలిపింది. ఈ క్రమంలోనే సన్ స్క్రీన్ లోషన్స్ విషయానికి వస్తే తాను వాటిని ఇప్పటి వరకు వాడలేదని తెలిపింది. బయటకు వెళ్లినప్పుడు ఎండ నుంచి రక్షణ కోసం ఈ లోషన్స్ రాసుకుంటారని.. కానీ ఇవి మన ఆరోగ్యానికి హాని కలగజేస్తాయని.. కనుకనే కాస్మొటిక్స్ను ఆద్య, అకీరా వాడకుండా చూస్తుంటానని.. రేణు దేశాయ్ తెలియజేసింది.
ఇక కరోనా సమయంలో రేణు దేశాయ్ సోషల్ మీడియాకు దూరంగా ఉంది. కానీ స్వచ్ఛంద సంస్థలతో కలిసి పేదల కోసం పనిచేసింది. అయితే సన్ స్క్రీన్ లోషన్ల విషయంలోనే కాదు.. ఇతర కాస్మొటిక్స్ను కూడా గుడ్డిగా వాడకండి.. అంటూ రేణు దేశాయ్ యువతకు పిలుపునిచ్చింది. కాగా రేణు దేశాయ్ ప్రస్తుతం ఆద్య అనే వెబ్ సిరీస్లో నటిస్తుండగా.. త్వరలోనే టైగర్ నాగేశ్వర్ రావు సినిమాలో కనిపించనుంది. ఇందులో ఆమె కీలకపాత్ర పోషిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…