Renu Desai : బద్రి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రేణు దేశాయ్ నటిగా, డైరెక్టర్గా, నిర్మాతగా, కాస్ట్యూమ్ డిజైనర్గా.. ఇలా బహుముఖ ప్రజ్ఞ చాటిన ఈమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బద్రి చిత్ర సమయంలో పవన్తో ప్రేమలో పడి ఆయనతోనే పెళ్లిపీటలెక్కింది. ఇక 2012లో పవన్ కల్యాణ్తో విడాకులు తీసుకున్నారు రేణూ దేశాయ్. అయినా ఇప్పటికీ జనాలు పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే ఆమెను చూస్తుంటారు. అప్పుడప్పుడు బుల్లితెరపై సందడి చేస్తున్న ఆమె కొన్ని డ్యాన్స్ షోలు, రియాలిటీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది.
కరోనా కంటే ముందు నుంచి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన రైతు గురించి రేణూ దేశాయ్ ఎన్నో ప్రణాళికలు ఆలోచించింది. ఎర్రటి ఎండలో.. నేల రెండుగా చీలి ఉన్న సమయంలోనే షూటింగ్ చేయాలని రేణూ దేశాయ్ ఎప్పటి నుంచో అనుకుంటోంది. గత రెండేళ్లుగా ఆ టైంలో లాక్డౌన్, కరోనా అంటూ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తన రైతు ప్రాజెక్ట్ను రేణూ దేశాయ్ పక్కన పెట్టేసింది.
అకీరా నందన్, ఆద్యలతో పాటు రేణూ దేశాయ్ ఓ నెల పాటుగా స్కాట్లాండ్ దేశంలో అంతా తిరిగి వచ్చినట్టుంది. అకీరా గ్రాడ్యుయేషన్ కోసం స్కాట్లాండ్ వెళ్లినట్టు కనిపిస్తోంది. అసలే అకీరా నందన్ తన గ్రాడ్యుయేషన్ కోసం ఏవేవో కలలు కంటున్నాడని రేణూ దేశాయ్ తెలియజేసింది. సంగీతంలో మాస్టర్స్ చేయాలని కోరిక ఉందంటూ, అంతేకాకుండా బాక్సింగ్, బాస్కెట్ బాల్ ఇలా ఆటల్లోనూ ఆరితేరిపోవాలని ఉందంటూ అకీరా నందన్ తన కోరికల లిస్ట్ చెబుతుంటాడట. ప్రస్తుతం రేణూ దేశాయ్ మాత్రం షూటింగ్ సెట్స్ లోకి అడుగు పెట్టేసింది. చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత రవితేజ హీరోగా రాబోతోన్న టైగర్ నాగేశ్వర రావు సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది రేణూ దేశాయ్. ఈ చిత్రంతో రేణుదేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.
ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నాడు చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో చిరంజీవి, రేణూ దేశాయ్ మాత్రం మాట్లాడుకోలేదు. ఇక ఈ చిత్రంలో భాగస్వామి అయినందుకు, తనకు మంచి పాత్రను తనకు ఇచ్చినందుకు రేణు దేశాయ్ దర్శకనిర్మాతలకు కృతజ్ఞతలు తెలియజేసింది. వేసవి ఎండలు దంచికొడుతున్నాయో ఏమో గానీ సెట్లో చాలా మంది గొడుగులు పట్టుకున్నారట. అందరూ షూటింగ్ లో ఎంతో కష్టపడుతూ గొడుగులు పట్టుకున్న వీడియోను రేణూ దేశాయ్ తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ వేసింది. త్వరలో టైగర్ నాగేశ్వరరావు చిత్రం ద్వారా రేణుదేశాయ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…
తమిళ నటుడు ఆర్. పార్థిబన్ చేసిన వ్యాఖ్యలకు గాను నటి త్రిష ఘాటుగా స్పందించింది. ఈ మేరకు త్రిష తన…
నటుడు జూనియర్ ఎన్టీఆర్ మార్చి 8, 2026న బెంగళూరులో నిర్వహించిన కిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.…