Curry Leaves Chutney : కరివేపాకును మనం ప్రతిరోజూ వంటల్లో వాడుతూ ఉంటాం. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కంటి చూపును మెరుగుపరచడంలో, గాయాలను తగ్గించడంలో కరివేపాకు సహాయపడుతుంది. బరువును తగ్గించడంలో, షుగర్ వ్యాధిని నియంత్రించడంలో, జ్ఞాపకశక్తిని, కంటి చూపును మెరుగుపరచడంలో కరివేపాకు ఎంతగానో ఉపయోడపడుతుంది. కరివేపాకుతో మనం కారం పొడిలను కూడా తయారు చేస్తూ ఉంటాం. కరివేపాకుతో ఎంతో రుచిగా ఉండే పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకుతో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టీ స్పూన్, ధనియాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, మినప పప్పు – 3 టీ స్పూన్స్, ఎండు మిర్చి – 8, కరివేపాకు ఆకులు – ఒక కప్పు, బెల్లం తురుము – 2 టీ స్పూన్స్, చింతపండు – ఒకటిన్నర టీ స్పూన్, ఉప్పు – ఒక టీ స్పూన్, నీళ్లు – అర కప్పు.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒ కటేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్.
కరివేపాకు పచ్చడి తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నూనె వేసి కాగాక ధనియాలు, జీలకర్ర, మినప పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు ఆకులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక జార్ లో వీటితోపాటు బెల్లం తురుము, ఉప్పు, చింతపండును వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత నీళ్లను వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి తాళింపు పదార్థాలు వేసి తాళింపు చేసుకోవాలి. ఇలా తాళింపు చేసుకున్న తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని వేసి కలుపుకోవాలి. 5 నిమిషాల పాటు ఈ పచ్చడిని చిన్న మంటపై వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పచ్చడి తయారవుతుంది. ఈ పచ్చడిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల నెల రోజుల వరకు తాజాగా ఉంటుంది. అన్నం, నెయ్యితో ఈ పచ్చడిని తింటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని అన్నంలో మొదటి ముద్దగా తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…