Tiger Nageshwar Rao : మాస్ మహారాజా రవితేజ మంచి దూకుడు మీదున్నాడు. ఆయన ఒక సినిమా పూర్తి కాకముందే మరో సినిమా ప్రకటిస్తున్నాడు. ఇప్పటికే ఖిలాడీ చిత్ర షూటింగ్ పూర్తి చేసి రిలీజ్కి సిద్ధంగా ఉంచాడు. ఇక రామారావు ఆన్ డ్యూటీ, ధమాకా అనే చిత్రాలు కూడా చేస్తున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర అనే పేరుతో కూడా సినిమా చేయనున్నాడు. ఇవి కాకుండా తాజాగా తన 71వ సినిమాకి సంబంధించి క్లారిటీ ఇచ్చాడు.
వంశీ దర్శకత్వంలో రవితేజ నటించనున్న కొత్త చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ‘అక్కడ దొంగలు, దోపిడీదారులు ఉండేవారు. అదే విధంగా టైగర్ నాగేశ్వరరావు కూడా’ అని చిత్ర బృందం ట్వీట్ చేసింది. 1970 దశకంలో అధికారులకు నాగేశ్వరరావు ముచ్చెమటలు పట్టించాడు.
1987లో పోలీసులు అతడిని మట్టుబెట్టారు. ఇప్పుడు ఆయన జీవిత నేపథ్యంలో రవితేజ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కథ పలువురు హీరోల దగ్గరకు వెళ్లి చివరకు రవితేజ దగ్గరకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు రవితేజ రూ.18 కోట్ల రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. దొంగాట సినిమా అందించిన దర్శకుడు వంశీ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ సరసన ఇద్దరు హీరోయిన్లు నటిస్తారు. అభిషేక్ నామా ఈ సినిమాకు నిర్మాత. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…