Rashmika Mandanna : ఛలో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా. కొంతకాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమె పుష్ప చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు బడా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ భామ మరోవైపు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఈమె గుడ్ బై అనే చిత్రంతో హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. వికాస్ బహల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నీనా గుప్తాలు ముఖ్య పాత్రలు పోషించారు.
అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. ఇదే ఆమెకు బాలీవుడ్లో తొలి చిత్రం. అమితాబ్ బచ్చన్ ఉన్నప్పటికీ ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ను సంపాదించలేకపోయింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ రూ.3 కోట్లు మాత్రమే వచ్చాయి. క్వీన్ మరియు సూపర్ 30 వంటి హిట్లను అందించిన వికాస్ బహ్ల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు కానీ అది కూడా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది.
పైగా ఈ చిత్రంలో రష్మిక నటన సాధారణంగా, పేలవంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆమె సౌత్ ఇండియన్ యాస కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. రష్మిక రాబోయే బాలీవుడ్ మూవీలు మిషన్ మజ్ను మరియు యానిమల్ వంటి సినిమాలతో నార్త్లో ఇంకా కొన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. ఆమె వాటిని పూర్తిగా ఉపయోగించుకోవాలి. లేదంటే బాలీవుడ్ లో తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే ఈ అమ్మడు. ఏదేమైనా రష్మిక గుడ్బై వంటి చిత్రాలను చేయకుండా ఉంటే మంచిదని సినీ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…