Rashmika Mandanna : స్టార్ హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఛలో’ సమయంలో ఈ అమ్మడు ఎంత గ్లామర్గా ఉందో… ఇప్పుడూ అలానే ఉంది. గ్లామర్ని కాపాడుకోవడం, కొత్తగా కనిపించడం.. రష్మిక మందన్నా విజయ రహస్యాలు. అయితే ఇదంతా అంత తేలిగ్గా జరగలేదు. ఫిట్నెస్, ఆహార నియమాలు, కాస్ట్యూమ్స్.. ఇలా అన్ని విషయాల్లోనూ ఆమె శ్రద్ధ పెట్టడంతోనే ఇది సాధ్యమైంది. సినిమా సినిమాకి తన టాలెంట్ పెంచుకుంటూ వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్న రష్మిక ప్రస్తుతం బాలీవుడ్లోను తెగ సందడి చేస్తుంది. ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లోకి సూపర్ ఉమెన్గా కూడా ముస్తాబైంది. ఉబికి వచ్చే అందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. తన హాట్ అందాలను ఆవిష్కరిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది రష్మిక మందన్నా.
గీతా గోవిందం సినిమాలో విజయ్ దేవరకొండ సరసన నటించిన రష్మిక అతనితో ప్రేమలో పడిందని చెప్పుకొస్తున్నారు. కొన్నాళ్లుగా కలిసి తిరుగుతున్నారని, సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్నారని ఎన్నో ప్రచారాలు సాగాయి. గత ఏడాది చివర్లో ఇద్దరూ కలిసి మాల్దీవులకి హాలిడేకి వెళ్లారు. వాస్తవానికి ముంబయి ఎయిర్పోర్ట్లోనే నిమిషాల వ్యవధిలో ఇద్దరూ ఎంట్రీ ఇవ్వడంతో వారిద్దరు ఒకే ప్లేస్కి వెళుతున్నారని అనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత ఇద్దరూ షేర్ చేసిన ఫొటోల బ్యాక్డ్రాప్ ఆధారంగా మాల్దీవుల్లో ఉన్నారని నెటిజన్లు కనిపెట్టేశారు.
రష్మిక మందన ఇన్స్టా లైవ్లో అభిమానులతో మాట్లాడుతుండగా.. ఆ సమయంలో విజయ్ దేవరకొండ వాయిస్ కూడా వినిపించింది. దాంతో ఇద్దరూ డేటింగ్లో ఉన్నారని ప్రచారాలు చేశారు. ఇదే సమయంలో రష్మిక ‘మిషన్ మజ్ను’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మాట్లాడుతూ…. విజయ్ దేవరకొండతో మాల్దీవుల ట్రిప్ పై స్పందించింది.. ‘‘అవును ఇద్దరం కలిసి మాల్దీవులకి వెళ్లాం. అందులో తప్పేముంది? మేము ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్ అంతే’ అని స్పష్టం చేసింది. దీంతో ఇండస్ట్రీలో మరో చర్చ నడుస్తుంది. గతంలో ఫ్రెండ్స్ అని చెప్పిన వాళ్లు చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నారు. వీరు అలా చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు అని అంటున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…