Taraka Ratna Family : నందమూరి తారకరత్న ప్రస్తుతం గుండెపోటుతో బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెబుతున్నారు. అభిమానులు త్వరగా కోలుకోవాలంటూ పూజలు చేస్తున్నారు. అయితే ఇలాంటి పరిస్థితులలో కొందరు తారకరత్నకు సంబంధించిన విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తారకరత్న లవ్ స్టోరీ సినిమాలని మించిన ట్విస్ట్లతో సాగిందట. 2012లో తారకరత్న పెద్దలను ఎదిరించి అలేఖ్య రెడ్డిని వివాహం ప్రేమ వివాహం చేసుకున్నారు.
గతంలో ఒకసారి ఇంటర్వ్యూలో అలేఖ్య రెడ్డిని తమ వివాహం గురించి వెల్లడించారు. తారకరత్న చెన్నైలో తన సోదరికి స్కూల్ లో ఆమెకి సీనియర్ అని చెప్పింది.. ఆ తర్వాత కామన్ ఫ్రెండ్ ద్వారా తాము హైదరాబాద్ లో కలిశామని అన్నారు. వాస్తవానికి మేము మొదట మంచి ఫ్రెండ్స్గా ఉన్నాం కానీ ఆ తర్వాత.. తారక రత్న మొదట ప్రపోజ్ చేయగా, అప్పుడు నేను మా పేరంట్స్తో మాట్లాడమని సూచించాను. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. దానికి కారణం సినిమా ఇండస్ట్రీపై వారికి మంచి అభిప్రాయం లేకపోవడమే అని ఆమె చెప్పింది.
మరో వైపు నందమూరి ఫ్యామిలీ కూడా వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. దానికి గల కారణాల్ని కూడా అలేఖ్య రెడ్డి వివరించారు. ‘‘తారక రత్న ఫ్యామిలీ కూడా మా పెళ్లికి ఒప్పుకోలేదు. దానికి కారణం.. నేను అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్నా. మళ్లీ పెళ్లి చేసుకుంటానని అసలు అనుకోలేదు. ఆ సమయంలో మా అంకుల్ విజయసాయి రెడ్డి మాకు మద్దతుగా నిలవడంతో మేము 2012, ఆగస్టు 2న సంఘీ టెంపుల్లో వివాహం చేసుకున్నాం. ఈ వివాహానికి ఇరు వైపు పెద్దలు ఎవరూ రాలేదు అని చెప్పింది అలేఖ్య. విజయసాయి రెడ్డి భార్య చెల్లెలు కుమార్తె ఈ అలేఖ్య రెడ్డి.తారక రత్న, అలేఖ్య రెడ్డికి 2013లో నిష్కా అనే పాప పుట్టింది. ప్రస్తుతం వారు సంతోషంగానే ఉన్నారు.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…