Almonds : మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల ఆహారాల్లో నట్స్ కూడా ఒకటి. నట్స్ అంటే.. మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి జీడిపప్పు, బాదంపప్పు. అయితే జీడిపప్పు కన్నా బాదంపప్పులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి. జీడిపప్పు వల్ల బరువు పెరుగుతారు. కానీ బాదం పప్పు అలా కాదు. బరువు తగ్గించడంతోపాటు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అయితే రోజుకు కేవలం 4 బాదం పప్పులను తిన్నా చాలు.. అద్భుతమైన లాభాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. బాదం పప్పులను 4 తీసుకుని నీటిలో నానబెట్టి తరువాత పొట్టు తీసి తినాలి. ఇలా రోజూ తింటుంటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. బాదంపప్పులను తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదంపప్పును తినడం వల్ల విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది. ఇది చర్మం, గోర్లు, శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మం పగులుతున్న వారు, గోర్లు విరిగిపోతున్నవారు లేదా శిరోజాల సమస్యలు ఉన్నవారు రోజూ బాదం పప్పును తినడం వల్ల ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మృదువుగా మారుతుంది. అలాగే గోర్లు ఆరోగ్యంగా ఉంటాయి. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి. ఇలా లాభాలను పొందవచ్చు. ఇక రోజూ బాదం పప్పును తినడం వల్ల శరీరంలోని కొవ్వు కరుగుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు. బరువు తగ్గలేమని బాధపడుతున్నవారు బాదంపప్పులను తినడం వల్ల చక్కని ఫలితం లభిస్తుంది.
వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి కావల్సిన బి విటమిన్లు, మెగ్నిషియం, పొటాషియంతోపాటు ప్రోటీన్లు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇవన్నీ మనకు అనారోగ్యాలు రాకుండా చూస్తాయి. ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే రోజూ బాదం పప్పును తినడం వల్ల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన అమైనో యాసిడ్లు అందుతాయి. ఇవి మన మెదడును యాక్టివ్గా ఉంచుతాయి. చురుగ్గా మారుస్తాయి. దీంతో వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్ రాకుండా ఉంటుంది. అలాగే మతిమరుపు బాధించదు. ఇక చిన్నారుల్లో అయితే మెదడు వికసిస్తుంది. చదువుల్లో రాణిస్తారు. కనుక రోజూ తప్పక బాదం పప్పులను తినాల్సి ఉంటుంది.
బాదంపప్పులో ఫాస్ఫరస్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే మెదడు యాక్టివ్గా పనిచేసేలా చేస్తుంది. బాదంపప్పును తినడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నిత్యం పని ఒత్తిడి లేదా ఇతర ఆందోళనలతో సతమతం అయ్యేవారు బాదంపప్పులను తినడం వల్ల తప్పక ఫలితం లభిస్తుంది. అలాగే బాదంపప్పును తినడం వల్ల హార్ట్ ఎటాక్లు వచ్చే ముప్పు తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వారంలో కనీసం 5 రోజుల పాటు బాదంపప్పును తింటే హార్ట్ ఎటాక్ వచ్చే ముప్పు 50 శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
బాదంపప్పును తినడం వల్ల రక్తనాళాలు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో హార్ట్ ఎటాక్ లు రావు. అలాగే బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ గుండెను సంరక్షిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. ఇక బాదంపప్పులో కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. ఇది దంతాలు, ఎముకలను దృఢంగా మారుస్తుంది. బాదంపప్పును తినడం వల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్డీఎల్) పెరుగుతుంది. దీంతో గుండెకు వాటిల్లే ముప్పు తగ్గుతుంది. అలాగే బాదంపప్పులో ఉండే విటమిన్ ఇ గర్భిణీలకు, వారి కడుపులో ఉండే శిశువులకు ఎంతగానో మేలు చేస్తుంది. కనుక గర్భిణీలు రోజూ బాదంపప్పును తినాలి. ఇలా బాదంపప్పును రోజూ తినడం వల్ల ఎంతో మేలు పొందవచ్చు. కనుక వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంటారు.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…