Vedam Movie Karpuram : సినీ ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా కలెక్షన్స్ రాబట్టకపోయిన కూడా మనసులు దోచుకుంటూ ఉంటుంది. అలా ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్న చిత్రాలలో వేదం సినిమా ఒకటి కాగా, ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా అల్లు అర్జున్ మరియు మనోజ్ లు హీరోలుగా నటించారు. ఇక ఈ సినిమాలో దీక్షాసేత్ హీరోయిన్ గా నటించింది. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయి ముఖ్యమైన పాత్రలో నటించారు. ఇక చిత్రంలో కేబుల్ రాజుగా అల్లు అర్జున్ నటించారు. అలాగే అనుష్క నటించిన సరోజ పాత్రకి కూడా చాలా మంచి పేరు వచ్చింది.
సినిమా ఫలితం ఎలా ఉన్నా, చాలా మంది ఈ సినిమాలో నటించిన వారి నటనని, అలాగే ఇలాంటి కథని ఏంచుకున్నందుకు క్రిష్ ని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ సినిమాలో అనుష్క పోషించిన సరోజ పాత్రతో మరో వ్యక్తి కూడా ఉంటారు. తనే కర్పూరం. సరోజ వేరే ఊరికి వెళ్లి ఇవన్నీ వదిలేసి వేరే జీవితం చూసుకుందాం అని నిర్ణయించుకున్నప్పుడు కర్పూరం సరోజకు మద్దతుగా ఉంటుంది. అయితే ఈ చిత్రంలో కర్పూరం పాత్ర పోషించిన వ్యక్తి పేరు నిక్కి.. ఇతను హీరోయిన్ అనుష్క పర్సనల్ మేకప్ స్టాఫ్.
వాస్తవానికి ఈ పాత్రను డైరెక్టర్ క్రిష్ చేయాలనుకున్నాడు కానీ క్రిష్ వాళ్ల తల్లి ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోలేదట. ఆ పాత్ర చేస్తే పెళ్లి కాదని చెప్పారట. దీంతో ఆ సమయంలో అనుష్క నిక్కి పేరు సజెస్ట్ చేయడంతో పాటు నిక్కి చేసిన ఒక డ్యాన్స్ వీడియో కూడా క్రిష్కి చూపించారు. ఆ వీడియో చూసి ఈ పాత్రకి నిక్కిని ఎంపిక చేశారు. ఈ క్యారెక్టర్ క్రిష్ చేస్తే ఎలా ఉండేదో అని అభిమానులు ఊహించుకుంటున్నారు. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలో అనుష్క అలాంటి పాత్రలో నటించడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. అనుష్క నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
తన వైవాహిక జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషకరంగా ఉందని, భర్త మథియాస్ బో తనకు భారంగా అనిపించేలా ఎప్పుడూ ప్రవర్తించలేదని…
నటుడు అక్షయ్ కుమార్ గతంలో తనకు చెప్పిన మాటలు ఎంతో ప్రేరణగా నిలిచాయని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఇటీవల…
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి ఘటనలో బాధ్యులను కఠినంగా శిక్షించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్…
టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా అహ్మదాబాద్లో సౌతాఫ్రికాతో జరిగిన సూపర్ 8 మ్యాచ్లో భారత్ ఓడిపోవడం మంచిదేనని, తప్పులను…
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 ఎడి సినిమాకు సీక్వెల్గా తెరకెక్కుతున్న కల్కి 2 చిత్ర షూటింగ్ ఫొటోను బాలీవుడ్…
టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే మళ్లీ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ చూస్తానని, కావాలంటే వైఎస్ జగన్కు కూడా…
తన వ్యక్తిగత జీవితంపై ట్రోలింగ్ చేస్తూ సోషల్ మీడియాలో వ్యతిరేకతను వ్యాపింపజేసే వారిని ఇకపై ఏమాత్రం సహించబోనని సమంత అన్నారు.…
తమిళ నటుడు విజయ్ సేతుపతితో దర్శకుడు మణిరత్నం తెరకెక్కించనున్న సినిమాలో నటి సాయిపల్లవిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయిపల్లవిని ఈ…