Rashmi Gautam : మన సమాజంలో ఎంతో మంది జంతు ప్రేమికులు ఉన్నారు. వారిలో యాంకర్ రష్మి గౌతమ్ ఒకరు. ఈమె మూగ జీవాలు బాధపడుతుంటే చూస్తూ తట్టుకోలేదు. వాటిని చిత్ర హింసలకు గురి చేసే వారిపై ఈమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంటుంది. కరోనా సమయంలోనూ ఈమె మూగ జీవాలకు ఆహారం పెట్టి వాటి సంరక్షణ బాధ్యతలు చూసుకుంది. ఇక అప్పుడప్పుడు ఏవైనా వీధి కుక్కలు గాయపడితే ఈమె చికిత్సను అందిస్తుంటుంది. అంతేకాదు శునకాలను హింసకు గురి చేసేవారిపై ఫిర్యాదు కూడా చేస్తుంటుంది.
కాగా రష్మి గౌతమ్ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఆమె జంతువులను ఏవిధంగా హింసిస్తున్నారో చెప్పుకొస్తూ బాధపడింది. డెయిరీ ఇండస్ట్రీలో పాల కోసం, పాల ఉత్పత్తుల కోసం సహజంగానే ఆవులు, గేదెలను హింసకు గురి చేస్తుంటారు. అలాంటి సంఘటనలపై రష్మి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేస్తుంటుంది. అందులో భాగంగానే ఆవును ఈడ్చుకుని వెళ్తున్న ఒక ఫొటోను షేర్ చేసిన ఈమె తన కోపాన్నంతా బయటపెట్టింది.
మన దేశంలో గోమాత అంటూ ఆవులను పూజిస్తారు. కానీ ఇదేం దరిద్రమో.. అవే ఆవులను పాల కోసం హింసిస్తారు. వాటిని ఇబ్బందులు పెట్టకుండా ఉండలేరా.. అలాంటి జీవుల చర్మంతో తయారైన లెదర్ వస్తువులను మనం వాడతుంటాం. వాటికి బదులుగా ఇతర విధానాల్లో తయారు చేసిన వస్తువులను వాడవచ్చు కదా.. అంటూ రష్మి గౌతమ్ తన ఆవేదనను వెలిబుచ్చింది. ఈ క్రమంలోనే రష్మి పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…