Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా మాత్రమే కాకుండా పలు స్పెషల్ ఈవెంట్ల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తుంటుంది. ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా మూగజీవాల పట్ల జరిగే దాడుల గురించి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుంటుంది.
ఈ విధంగా మూగజీవాల పట్ల జరిగే దాడుల గురించి ఎదిరించే రష్మి హోలీ సందర్భంగా పొరపాటున కూడా రంగులు జీవాలపై వేయకండి, వాటిలో రసాయనాలు ఉండటం వల్ల వాటిపై తీవ్రమైన ప్రభావాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు ఈ రసాయనాల వల్ల చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.. అంటూ కోరింది. అయితే రష్మి ఇలా చెప్పినప్పటికీ కొందరు ఆకతాయిలు కావాలనే ఒక కుక్కను కట్టేసి దానిపై రంగులు చల్లారు. ఆ కుక్క ఎంత గట్టిగా అరుస్తున్నా వినిపించుకోకుండా వారు తమ ఆనందం కోసం ఆ కుక్కను ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తప్పకుండా వారిని అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విధంగా రష్మీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలా తక్కువ సమయంలోనే వారిని పట్టుకున్నారు. సోషల్ మీడియా కు ఉన్న పవర్ తో వారి ఆచూకీ కనుగొని వారికి గట్టిగా బుద్ధి చెప్పారు. అయితే హోలీ జరుపుకున్న రెండు రోజులైనా ఆ కుక్కకు ఇప్పటి వరకు స్నానం చేయించక పోవడంతో రష్మి ఆవేదన వ్యక్తం చేసింది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…