Rashmi Gautam : జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె జబర్దస్త్ యాంకర్ గా మాత్రమే కాకుండా పలు స్పెషల్ ఈవెంట్ల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తుంటుంది. ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ముఖ్యంగా మూగజీవాల పట్ల జరిగే దాడుల గురించి సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తుంటుంది.
ఈ విధంగా మూగజీవాల పట్ల జరిగే దాడుల గురించి ఎదిరించే రష్మి హోలీ సందర్భంగా పొరపాటున కూడా రంగులు జీవాలపై వేయకండి, వాటిలో రసాయనాలు ఉండటం వల్ల వాటిపై తీవ్రమైన ప్రభావాలు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు ఈ రసాయనాల వల్ల చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది.. అంటూ కోరింది. అయితే రష్మి ఇలా చెప్పినప్పటికీ కొందరు ఆకతాయిలు కావాలనే ఒక కుక్కను కట్టేసి దానిపై రంగులు చల్లారు. ఆ కుక్క ఎంత గట్టిగా అరుస్తున్నా వినిపించుకోకుండా వారు తమ ఆనందం కోసం ఆ కుక్కను ఎన్నో చిత్రహింసలకు గురి చేశారు.
ఇక ఈ ఘటనకు సంబంధించిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తప్పకుండా వారిని అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విధంగా రష్మీ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో చాలా తక్కువ సమయంలోనే వారిని పట్టుకున్నారు. సోషల్ మీడియా కు ఉన్న పవర్ తో వారి ఆచూకీ కనుగొని వారికి గట్టిగా బుద్ధి చెప్పారు. అయితే హోలీ జరుపుకున్న రెండు రోజులైనా ఆ కుక్కకు ఇప్పటి వరకు స్నానం చేయించక పోవడంతో రష్మి ఆవేదన వ్యక్తం చేసింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…