Finger Millets : ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి. ఇలా ఎంతో మంది మధుమేహం, అధిక రక్తపోటు, రక్తహీనత సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ విధమైనటువంటి సమస్యలన్నింటికీ చెక్ పెట్టడానికి రాగులు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పాలి. తరచూ రాగులు తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి, ఏవిధమైనటువంటి రోగాలకు చెక్ పెట్టవచ్చు.. అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
* రాగులలో కాల్షియం అధికంగా లభిస్తుంది. నిత్యం రాగి జావ తీసుకోవడం వల్ల తగినంత మోతాదులో క్యాల్షియం మన శరీరానికి అందుతుంది. దీనివల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి.
* నిద్రలేమి సమస్యతో బాధపడేవారు ప్రతిరోజూ ఒక గ్లాసు రాగి జావ తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు.
*జీర్ణక్రియ సంబంధిత సమస్యలతో బాధపడేవారు తరచూ వారి ఆహార పదార్థాలలో రాగులు ఉండేలా చూసుకోవాలి. రాగులలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం తగ్గుతుంది.
* రాగులు చర్మంపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలోనే రాగి పిండితో ముఖంపై మర్దనా చేయడంవల్ల చర్మంపై ఉండే మృతకణాలు తొలగిపోవడమే కాకుండా చర్మం ఎంతో కాంతివంతంగా బిగుతుగా మారుతుంది. దీంతోపాటు ముడతలు రాకుండా కాపాడుతాయి. అలాగే రాగులను తీసుకుంటే బద్దకం తగ్గుతుంది. యాక్టివ్గా ఉంటారు.
* మధుమేహంతో బాధపడేవారికి రాగులు దివ్యౌషధమనే చెప్పాలి. తరచూ రాగి జావ, రాగి ముద్ద వంటి వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవచ్చు. దీంతో డయాబెటిస్ అదుపులో ఉంటుంది.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…