Rana : నాగచైతన్య గత రెండు చిత్రాలు ఘన విజయాన్ని సాధించిన విషయం విదితమే. లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల సక్సెస్తో చైతూ మంచి జోష్ మీద ఉన్నాడు. త్వరలోనే ఈయన నటించిన హిందీ మూవీ లాల్ సింగ్ చడ్డా కూడా రిలీజ్ కానుంది. ఇందులో చైతూ అమీర్ఖాన్ తో కలిసి నటించాడు. ఇక మనం సినిమా ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వస్తున్న థాంక్ యూ లోనూ చైతూ నటించాడు. ఈ మూవీ ఇప్పటికే షూటింగ్ పనులు పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో త్వరలోనే ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలోంచి ఇటీవలే విడుదల చేసిన ఓ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
చైతన్య ఈ మూవీలో స్వార్థపూరితమైన వ్యక్తిగా కనిపిస్తాడు. తరువాత మారిపోయి తనను తాను సరిచేసుకుంటున్న వ్యక్తిగా కనిపిస్తాడు. దీంతో లవ్ బ్రేకప్ అయ్యాక చైతూ తిరిగి లవ్లో ఎలా పడ్డాడు.. అన్న కథాంశం ఈ మూవీలో ఉంటుందని టీజర్ను బట్టి చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ మూవీలో రాశిఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ లు ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అయితే టీజర్లో ఉన్న చైతూ డైలాగ్స్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారాయి.
నన్ను నేను సరిచేసుకునేందుకు యత్నిస్తున్నాను, లైఫ్లో ఇక కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, జీవితంలో చాలా వదులుకుని ఇక్కడివరకు వచ్చాను.. అని టీజర్లో చైతన్య డైలాగ్ ఉంది. అయితే దీన్ని సమంతకు ఆపాదిస్తున్నారు. ఈ డైలాగ్ను సమంత ఉద్దేశించే పెట్టి ఉంటారని చర్చ నడుస్తోంది. అయితే పుండు మీద కారం చల్లినట్లుగా చైతన్యకు చెందిన ఈ డైలాగ్స్ పై రానా కామెంట్లు చేశాడు. నువ్వు ఆల్రెడీ సరి అయిపోయావు బ్రదర్.. అని రానా ట్వీట్ చేశారు. దీంతోపాటు చిత్ర యూనిట్కు రానా బెస్టాఫ్ లక్ చెప్నారు. దీంతో రానా కూడా సమంతను ఉద్దేశించే ఆ కామెంట్స్ చేసి ఉంటాడని అంటున్నారు.
అంటే సమంతను విడిచిపెట్టిన తరువాతనే నాగచైతన్య సరి అయ్యాడా.. అని నెటిజన్లు రానాను అడుగుతున్నారు. సమంతకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించాకే చైతూ ఒక దారిలోకి వచ్చాడా.. రానా అన్న.. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వు.. అని అడుగుతున్నారు. అయితే రానా సమంతను ఉద్దేశించి ఆ విధంగా కామెంట్లు పెట్టి ఉండకపోవచ్చు. కానీ తీవ్రంగా ఆలోచిస్తే ఆ కామెంట్లలో అంతరార్థం కూడా ఉంది. మరి చైతన్య థాంక్ యూ మూవీ రిలీజ్ అయ్యాక అందులో ఇంకా ఇలాంటి డైలాగ్స్ ఎన్ని ఉంటాయో చూడాలి.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…