F3 Movie : అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్2కు సీక్వెల్గా వచ్చిన ఎఫ్3 మూవీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఫ్యామిలీ ఆడియెన్స్కు ఈ మూవీ తెగ నచ్చేసింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ ఘన విజయం సాధించింది. కామెడీ ప్రధానాంశంగా ఈ మూవీని తెరకెక్కించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అయితే ఇందులో కొన్ని సిల్లీ కామెడీ సీన్లు ఉన్నాయి. అయినప్పటికీ ఓవరాల్గా చూస్తే.. ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతారు. కనుకనే సినిమాకు ఆదరణ లభిస్తోంది. అయితే ఈ మూవీ ఏమోగానీ ఇప్పుడు పలువురు హీరోలకు చెందిన ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధమే కొనసాగుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఎఫ్3 మూవీ క్లైమాక్స్ సీన్లలో ప్రభాస్ బాహుబలి, పవన్ వకీల్ సాబ్, గబ్బర్ సింగ్, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, ఎన్టీఆర్ అరవింద సమేత, రామ్ చరణ్ రంగస్థలం, ఆర్ఆర్ఆర్, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో, పుష్ప సినిమాల్లోని పాత్రలను చూపించారు. అయితే తమ హీరోలను ఇలా చూపించడం ఫ్యాన్స్కు నచ్చలేదు. దీంతో వెంకటేష్, వరుణ్ తేజ్ లను ఆయా హీరోలకు చెందిన ఫ్యాన్స్ తెగ ట్రోల్ చేస్తూ మీమ్స్ చేస్తున్నారు.
ఇక వరుణ్ తేజ్ కాసేపు పవన్ వకీల్ సాబ్లా కనిపించాడు. అయితే వరుణ్ కామెడీగా చేసినందున పవన్ ఫ్యాన్స్ ఆయనకు అవమానం జరిగిందని ఫీలవుతున్నారు. దీంతో వరుణ్ తేజ్ను వారు ట్రోల్ చేస్తూ విమర్శిస్తున్నారు. అయితే మొత్తానికి దర్శకుడు అనిల్ రావిపూడి అనుకున్నట్లుగానే ఈ మూవీకి నెగెటివ్ పబ్లిసిటీ జరుగుతోంది. మరి ఇది ప్రేక్షకులను థియేటర్లకు ఎక్కువ మొత్తంలో రప్పిస్తుందా.. ఎఫ్3 మూవీ మొత్తంగా ఎంత వసూలు చేస్తుంది.. అన్న వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. కానీ అలా పలువురు హీరోలకు చెందిన పాత్రలను కామెడీగా చూపించడంతో ఫ్యాన్స్ మాత్రం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఒక హీరో ఫ్యాన్స్ పై మరొకరు విమర్శలు చేస్తున్నారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
బంగ్లాదేశ్లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…
భారత టీ20ఐ క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని సాధించి అప్పుడే వారం రోజులు కావస్తోంది. అయినప్పటికీ…
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాలపై కేంద్ర ప్రభుత్వం శనివారం (మార్చి 14, 2026) స్పందించింది.…
హైదరాబాద్లో మొదటిసారి ఏర్పాటు చేసిన డాల్బీ సినిమా థియేటర్గా, అలాగే భారతదేశంలోనే అతిపెద్ద డాల్బీ సినిమాగా ప్రచారం పొందిన అల్లు…
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…