Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప మొదటి పార్ట్ అందించిన జోష్లో ఉన్నారు. పుష్ప 2 ఇంకా మొదలు కాలేదు. కానీ ఆ మూవీ ప్రారంభం అయ్యేలోగా వీలైనన్ని ఎక్కువ టూర్లు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకనే ఇటీవల దుబాయ్ వెళ్లగా.. ఇప్పుడు కుటుంబంతో కలిసి మళ్లీ టూర్కు వెళ్లారు. ప్రస్తుతం బన్నీ ఫ్యామిలీ లండన్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే అక్కడి ఫొటోలను అల్లు అర్జున్ షేర్ చేస్తున్నారు.
ఇక లండన్లో బన్నీ భార్య స్నేహా రెడ్డి కూడా ఫొటోలను దిగి షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా అల్లు అర్జున్ తన కుమారుడు అల్లు అయాన్కు చెందిన ఫొటోను షేర్ చేశారు. అందులో మై నింజా బాబు అని అల్లు అర్జున్ కాప్షన్ పెట్టారు. ఈ క్రమంలోనే ఈ ఫొటోకు కేవలం ఒక గంట వ్యవధిలోనే 5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇక ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా బన్నీ కొడుకును ఇలా చూసిన ఆయన ఫ్యాన్స్ తెగ సంబర పడిపోతున్నారు.
కాగా పుష్ప 2 షూటింగ్ ఈపాటికే ప్రారంభం కావల్సి ఉంది. కానీ అనేక కారణాల వల్ల వాయిదా పడుతోంది. ఈ మూవీకి గాను అల్లు అర్జున్ మొదటి పార్ట్కు రూ.35 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. అయితే రెండో పార్ట్కు రెమ్యునరేషన్ వద్దని.. హిందీ హక్కులను పూర్తిగా తమకు ఇచ్చేయాలని అల్లు అర్జున్ పట్టుబడుతున్నారట. దీంతో నిర్మాతలకు, అల్లు అర్జున్కు మధ్య చర్చలు ఇంకా నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై క్లారిటీ వస్తే త్వరలోనే పుష్ప 2 ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక పుష్ప 2వ పార్ట్లో పుష్పకు, భన్వర్ సింగ్ షెకావత్కు మధ్య పోరాటం ఉంటుందని సమాచారం. దీంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం దేవర: పార్ట్ 2 భవితవ్యంపై గత కొంతకాలంగా అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ…
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్కు అనుసంధానమైన మొబైల్ నంబర్ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్లోని…