ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రెటీస్ వరకు ఎవరు ఏది చెప్పాలనుకున్నా సోషల్ మీడియానే వేదికగా వాడుకుంటున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు అత్యంత శక్తివంతమైన ప్రసార సాధనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఇన్స్టాగ్రామ్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఫ్యామిలీ, కెరీర్ విషయాలను షేర్ చేసుకోవచ్చు. సామాన్యులు సైతం దీన్ని వాడడం, ఫాలో అవుతున్న సమయంలో రానా దగ్గుబాటి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించారు. ఆయన ఇన్స్టాగ్రామ్ నుంచి తప్పుకున్నారు.
గత ఐదు రోజు క్రితం సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నా అని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పోస్ట్ లన్నీ డిలీట్ చేశారు. ఫోటోలతో సహా ఇన్స్టా మొత్తం డిలీట్ చేశారు. కొంతకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నానని, ఇది చాలా ఉత్తమమైన, శక్తివంతమైన నిర్ణయమని, మంచి సినిమాలతో కలుద్దామని చెప్పారు.
మీపై అమితమైన ప్రేమతో అని ఇటీవల రానా ట్విట్టర్లో పేర్కొన్న విసయం తెలిసిందే. కేవలం ఇన్స్టాగ్రామ్కి దూరంగా ఉంటారా ? ట్విట్టర్ కూడా దూరమవుతారా ? అనేది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉండగా.. సినిమాల విషయంలో ఆయన బ్రేక్ తీసుకుంటున్నాడా ? లేక వ్యక్తిగతంగా ఏవైనా ఇబ్బందులా ? అనేది ప్రశ్నగా మారింది. రానా రెండేళ్ల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు. ప్రియురాలు మిహీకా బజాజ్ ని ఆయన 2020లో కరోనా సమయంలో మే 20న ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆయన, ఆగస్ట్ 8న మ్యారేజ్ చేసుకున్నారు.
సోమవారంతోనే వీరి పెళ్లి అయి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి రానా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లన్నీ డిలీట్ చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ మిహీకా ఇద్దరూ కలిసున్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి అందరి అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇటీవల విడుదలైన విరాట పర్వం మూవీకి ఆశించిన ఫలితం రానప్పటికీ రానా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…