ప్రస్తుతం సామాన్యుల నుంచి సెలబ్రెటీస్ వరకు ఎవరు ఏది చెప్పాలనుకున్నా సోషల్ మీడియానే వేదికగా వాడుకుంటున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు అత్యంత శక్తివంతమైన ప్రసార సాధనంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఇన్స్టాగ్రామ్ కి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో ఫ్యామిలీ, కెరీర్ విషయాలను షేర్ చేసుకోవచ్చు. సామాన్యులు సైతం దీన్ని వాడడం, ఫాలో అవుతున్న సమయంలో రానా దగ్గుబాటి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించారు. ఆయన ఇన్స్టాగ్రామ్ నుంచి తప్పుకున్నారు.
గత ఐదు రోజు క్రితం సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నా అని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన పోస్ట్ లన్నీ డిలీట్ చేశారు. ఫోటోలతో సహా ఇన్స్టా మొత్తం డిలీట్ చేశారు. కొంతకాలం సోషల్ మీడియాకి దూరంగా ఉండాలనుకుంటున్నానని, ఇది చాలా ఉత్తమమైన, శక్తివంతమైన నిర్ణయమని, మంచి సినిమాలతో కలుద్దామని చెప్పారు.
మీపై అమితమైన ప్రేమతో అని ఇటీవల రానా ట్విట్టర్లో పేర్కొన్న విసయం తెలిసిందే. కేవలం ఇన్స్టాగ్రామ్కి దూరంగా ఉంటారా ? ట్విట్టర్ కూడా దూరమవుతారా ? అనేది సస్పెన్స్ గా మారింది. ఇదిలా ఉండగా.. సినిమాల విషయంలో ఆయన బ్రేక్ తీసుకుంటున్నాడా ? లేక వ్యక్తిగతంగా ఏవైనా ఇబ్బందులా ? అనేది ప్రశ్నగా మారింది. రానా రెండేళ్ల క్రితం మ్యారేజ్ చేసుకున్నారు. ప్రియురాలు మిహీకా బజాజ్ ని ఆయన 2020లో కరోనా సమయంలో మే 20న ఎంగేజ్మెంట్ చేసుకున్న ఆయన, ఆగస్ట్ 8న మ్యారేజ్ చేసుకున్నారు.
సోమవారంతోనే వీరి పెళ్లి అయి రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. కానీ కరెక్ట్ గా అదే సమయానికి రానా ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లన్నీ డిలీట్ చేయడం మరింత అనుమానాలకు తావిస్తోంది. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ మిహీకా ఇద్దరూ కలిసున్న ఫోటోను సోషల్ మీడియాలో పెట్టి అందరి అనుమానాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇటీవల విడుదలైన విరాట పర్వం మూవీకి ఆశించిన ఫలితం రానప్పటికీ రానా నటనకు మంచి మార్కులు పడ్డాయి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…