Ramarao On Duty : భారీ అంచనాల మధ్య జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మాస్ మహారాజా రవితేజ నటించిన లెటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రాన్ని యువ దర్శకుడు శరత్ మండవ తెరకెక్కించాడు. రవితేజ టీం వర్క్స్, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ చిత్రంలో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్స్ గా నటించారు. రామారావు ఆన్ డ్యూటీ విడుదలైన తొలిరోజు మార్నింగ్ షోకే డిజాస్టర్ టాక్ అందుకుంది. అయితే ఉన్నంతలో విడుదలైన రోజు మార్నింగ్ షోకు ఓపెనింగ్స్ ఫరవాలేదనిపించాయి. కానీ మాట్నీ నుంచి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద లెక్కలను తారుమారు చేస్తూ బోల్తా పడింది.
1993లో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు శరత్ మండవ. కథ పరంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. రామారావు ఆన్ డ్యూటీ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. కానీ అందులో పావు వంతు కూడా రికవరీ సంపాదించలేకపోయింది. మాస్ మహరాజా రవితేజ సినిమాలు ఈ మధ్య కాలంలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. క్రాక్ చిత్రంతో విజయాన్ని అందుకున్న రవితేజ, మరలా ఖిలాడి చిత్రంతో ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ కూడా రవితేజకు సరైన సక్సెస్ ని ఇవ్వలేకపోయింది.
భారీ అంచనాల నడుమ జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఓటీటీ లో రిలీజై సందడి చేయడానికి ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. రామారావు ఆన్ డ్యూటీ చిత్రం ఓటీటీ రైట్స్ ని సోనీ లివ్ వారు కొనుగోలు చేశారు. దాదాపు ఆరు వారాల తర్వాత అంటే వచ్చే నెల సెప్టెంబర్ 15 నుంచి ఈ చిత్రం ఆ యాప్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి రామారావు ఆన్ డ్యూటీ ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…