Ram Gopal Varma : వివాదాలు సృష్టించడంలో ముందు వరసలో ఉండే వ్యక్తి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రతి విషయంపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటాడు. అవి కాస్తా కాంట్రవర్సీలకు దారి తీస్తూ ఉంటాయి. తాజాగా ఆయన కృష్ణం రాజు మృతిపై స్పందిస్తూ చేసిన వాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. ఇక ఆయన ట్విట్టర్ వేదికగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.
సీనియర్ నటుడు కృష్ణం రాజు మృతితో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే దీనిపై వరుస ట్వీట్లు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్దలపై విరుచుకు పడుతున్నాడు. ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కృష్ణం రాజు మరణంపై తన అభిప్రాయాలను రాస్తూ.. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు.. సిగ్గు..! సిగ్గు..! అని తీవ్ర పదజాలంతో రాయడం జరిగింది.
అంతటితో ఆగకుండా.. కృష్ణ గారికి, మురళీ మోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, బాలయ్యకి, ప్రభాస్ కి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.. అంటూ సినీ పెద్దలను ఘాటుగా విమర్శించాడు.
ఇంకా సినిమా షూటింగ్ లు ఆపక పోవడంపై తన అసహనం తెలుపుతూ.. మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం.. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది.. అంటూ షూటింగ్ లు ఆపడానికి పిలుపునిచ్చారు. ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనను పట్టించుకుంటుందో లేదో అని పలువురు భావిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ 2026 ట్రోఫీ సాధించిన అనంతరం యావత్ భారతదేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయర్లు తమ కుటుంబ…
కువైట్ నుంచి తాను సురక్షితంగా ఇండియాకు చేరుకున్నానని నటి ఊర్వశి రౌటేలా వెల్లడించింది. తాను ముంబైకి చేరుకున్నానని చెబుతూ ఆమె…
టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…
ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవత్సరానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్యక్రమాన్ని ఈ నెల…
భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుందని నటి ప్రియాంక చోప్రా అన్నారు.…
భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవలే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…