Ram Gopal Varma : వివాదాలు సృష్టించడంలో ముందు వరసలో ఉండే వ్యక్తి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ప్రతి విషయంపై తనదైన రీతిలో స్పందిస్తూ ఉంటాడు. అవి కాస్తా కాంట్రవర్సీలకు దారి తీస్తూ ఉంటాయి. తాజాగా ఆయన కృష్ణం రాజు మృతిపై స్పందిస్తూ చేసిన వాఖ్యలు తెలుగు సినీ పరిశ్రమలో దుమారం రేపుతున్నాయి. ఇక ఆయన ట్విట్టర్ వేదికగా తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు హీరోలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం చర్చనీయాంశం అవుతోంది.
సీనియర్ నటుడు కృష్ణం రాజు మృతితో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే దీనిపై వరుస ట్వీట్లు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ తెలుగు చిత్ర పరిశ్రమలోని పెద్దలపై విరుచుకు పడుతున్నాడు. ఆయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా కృష్ణం రాజు మరణంపై తన అభిప్రాయాలను రాస్తూ.. భక్త కన్నప్ప, కటకటాల రుద్రయ్య, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్ర పాపారాయుడు లాంటి అత్యంత గొప్ప చిత్రాలని అందించిన మహా నటుడు, గొప్ప నిర్మాత కోసం ఒక్క రోజు కూడా షూటింగ్ ఆపలేని అత్యంత స్వార్ధపూరిత తెలుగు సినిమా పరిశ్రమకి నా జోహార్లు.. సిగ్గు..! సిగ్గు..! అని తీవ్ర పదజాలంతో రాయడం జరిగింది.
అంతటితో ఆగకుండా.. కృష్ణ గారికి, మురళీ మోహన్ గారికి, చిరంజీవి గారికి, మోహన్ బాబు గారికి, బాలయ్యకి, ప్రభాస్ కి, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లకి నేను ఈ విషయం మీద మనవి చేసేదేంటంటే రేపు ఇదే దుస్థితి మీలో ఎవరికీ కూడా తప్పదు. ఒక మహోన్నత కళాకారుడికి ఇవ్వలేని మహోన్నత వీడ్కోలు మన మీద మనమే ఉమ్మేసుకోవడం లాంటిది.. అంటూ సినీ పెద్దలను ఘాటుగా విమర్శించాడు.
ఇంకా సినిమా షూటింగ్ లు ఆపక పోవడంపై తన అసహనం తెలుపుతూ.. మనసు లేకపోయినా ఓకే. కనీసం మన చావుకి విలువ ఉండాలంటే పోయిన కృష్ణంరాజు గారి లాంటి పెద్దమనిషికి విలువ ఇద్దాం.. కనీసం రెండు రోజులు షూటింగ్ ఆపుదాం. డబ్బు ఎక్కువ ఖర్చు అయిపోతోంది అని నెలరోజులు షూటింగ్ ఆపేసిన పరిశ్రమ మనది.. అంటూ షూటింగ్ లు ఆపడానికి పిలుపునిచ్చారు. ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. కానీ తెలుగు చిత్ర పరిశ్రమ ఆయనను పట్టించుకుంటుందో లేదో అని పలువురు భావిస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…