Ram Charan NTR : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. బాహుబలికి మించి కలెక్షన్లను వసూలు చేస్తూ మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ఈ క్రమంలోనే త్వరలో మేకర్స్ ఈ మూవీని చైనా, జపాన్లలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల అనంతరం కొంత గ్యాప్ ఇచ్చిన హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్లు.. వరుసగా మాలధారణ చేశారు. ముందుగా చరణ్ అయ్యప్ప మాల ధరించగా.. ఇప్పుడు ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే మరో 21 రోజుల పాటు ఆయన నిష్టగా ఉండి తరువాత మాల తీసేస్తారు.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఈ ఇద్దరు హీరోలు వరుసగా మాలలను ధరించడం ఆలోచింపజేస్తోంది. వీరు మాలను ఇప్పుడే ఎందుకు ధరించారు.. అది కూడా ఒకరి తరువాత ఒకరు ఏదో కూడబలుక్కున్నట్లు మాలను ధరించారు.. కారణం ఏమై ఉంటుందబ్బా.. అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. అయితే అందుకు కారణాలను కూడా వారే అన్వేషిస్తున్నారు. కొన్నింటిని వారు కారణాలుగా చూపుతున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అయితే మాల ధరిస్తామని చరణ్, ఎన్టీఆర్లు ఇద్దరూ తమ ఇష్టదైవాలకు మొక్కుకుని ఉండవచ్చు. అది ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక ఈ మూవీని తీసేందుకు చాలా కాలం పట్టింది. కనుక వీరికి మాల ధరించే అవకాశం రాలేదని.. ఇప్పుడు సినిమా విడుదలై అంతా సద్దు మణిగింది కనుక ఇక మాలను ధరించవచ్చని అనుకున్నారేమో. కనుకనే ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు మాలలను ధరించారని తెలుస్తోంది. అయితే దీక్షల అనంతరం త్వరలోనే వీరు తమ తమ సినిమాలతో బిజీ కానున్నారు.
చరణ్ నటించిన ఆచార్య మూవీ ఈ నెల 29వ తేదీన విడుదల కానుండగా.. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్మాత అయిన చరణ్ స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే దీక్ష తరువాత ఆయన శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ తదుపరి షెడ్యూల్లో పాల్గొననున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ దీక్ష అయ్యాక కొరాటల శివతో సినిమా చేయనున్నారు.
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…
పబ్లిక్లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన…
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…