Ram Charan NTR : దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్.. బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది. బాహుబలికి మించి కలెక్షన్లను వసూలు చేస్తూ మరోసారి తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటింది. ఈ క్రమంలోనే త్వరలో మేకర్స్ ఈ మూవీని చైనా, జపాన్లలోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల అనంతరం కొంత గ్యాప్ ఇచ్చిన హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్లు.. వరుసగా మాలధారణ చేశారు. ముందుగా చరణ్ అయ్యప్ప మాల ధరించగా.. ఇప్పుడు ఎన్టీఆర్ హనుమాన్ దీక్ష చేపట్టారు. ఈ క్రమంలోనే మరో 21 రోజుల పాటు ఆయన నిష్టగా ఉండి తరువాత మాల తీసేస్తారు.
అయితే ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఈ ఇద్దరు హీరోలు వరుసగా మాలలను ధరించడం ఆలోచింపజేస్తోంది. వీరు మాలను ఇప్పుడే ఎందుకు ధరించారు.. అది కూడా ఒకరి తరువాత ఒకరు ఏదో కూడబలుక్కున్నట్లు మాలను ధరించారు.. కారణం ఏమై ఉంటుందబ్బా.. అని ఫ్యాన్స్ తెగ ఆలోచిస్తున్నారు. అయితే అందుకు కారణాలను కూడా వారే అన్వేషిస్తున్నారు. కొన్నింటిని వారు కారణాలుగా చూపుతున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అయితే మాల ధరిస్తామని చరణ్, ఎన్టీఆర్లు ఇద్దరూ తమ ఇష్టదైవాలకు మొక్కుకుని ఉండవచ్చు. అది ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇక ఈ మూవీని తీసేందుకు చాలా కాలం పట్టింది. కనుక వీరికి మాల ధరించే అవకాశం రాలేదని.. ఇప్పుడు సినిమా విడుదలై అంతా సద్దు మణిగింది కనుక ఇక మాలను ధరించవచ్చని అనుకున్నారేమో. కనుకనే ఇద్దరూ ఒకరి తరువాత ఒకరు మాలలను ధరించారని తెలుస్తోంది. అయితే దీక్షల అనంతరం త్వరలోనే వీరు తమ తమ సినిమాలతో బిజీ కానున్నారు.
చరణ్ నటించిన ఆచార్య మూవీ ఈ నెల 29వ తేదీన విడుదల కానుండగా.. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా కీలకపాత్రలో నటించారు. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను నిర్మాత అయిన చరణ్ స్వయంగా దగ్గరుండి చూసుకుంటున్నారు. అలాగే దీక్ష తరువాత ఆయన శంకర్ తెరకెక్కిస్తున్న మూవీ తదుపరి షెడ్యూల్లో పాల్గొననున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ దీక్ష అయ్యాక కొరాటల శివతో సినిమా చేయనున్నారు.
భారత్లో నిర్వహించిన భారీ స్థాయి ఆరోగ్య అధ్యయనంలో పాల్గొన్న వారిలో దాదాపు 40 శాతం మంది మెటబాలిక్-డిస్ఫంక్షన్-అసోసియేటెడ్ స్టియాటోటిక్ లివర్…
కాలేయం రోజూ నిశ్శబ్దంగా పనిచేస్తుంది. శరీరంలోకి వచ్చే విషపదార్థాలను వడపోయడం, హార్మోన్ల సమతుల్యతను కాపాడడం, జీర్ణక్రియకు సహకరించడం.. ఈ మూడు…
నిధి అగర్వాల్ కెరీర్లో ఇటీవల భారీ బడ్జెట్ సినిమాలు ముఖ్యంగా హీరోయిన్లకు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపిస్తోంది. సినీ పరిశ్రమలో…
గూగుల్ తన కొత్త మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ గూగుల్ పిక్సెల్ 10ఎ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. పిక్సెల్ 10…
నటి రష్మిక మందన్న ఇప్పటివరకు తన వివాహంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయకుండా మౌనంగా వ్యవహరించింది. అయితే తాజాగా పాపరాజీతో…
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సివిల్ సర్వీసెస్ పరీక్ష 2026 కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారిక నోటిఫికేషన్ను…
తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే ఆరోపణలు ఆంధ్రప్రదేశ్లో పెద్ద రాజకీయ, భావోద్వేగ చర్చకు తెరతీశాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ…
మధుమేహంతో జీవిస్తున్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం పెద్ద సవాలే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేస్తే…