Ram Charan : మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి నటించిన తొలి ఫుల్ లెంగ్త్ మూవీ.. ఆచార్య. ఈ మూవీ వాస్తవానికి ఎప్పుడో రిలీజ్ కావల్సి ఉంది. కానీ కరోనాతోపాటు పలు ఇతర కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడింది. దీంతో విడుదలను కూడా వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఎట్టకేలకు ఈ మూవీ ఈ ఏడాది వేసవిలో రిలీజ్ అయింది. కానీ అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్గా నిలిచింది. చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్గా ఆచార్య చెత్త రికార్డులను నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఈ మూవీకి గాను భారీగా నష్టాలు కూడా వచ్చాయి. మేకర్స్కు ఏకంగా రూ.80 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే ఆచార్య మూవీ ఫ్లాప్ కావడంపై ఇప్పటి వరకు చిరంజీవి మాట్లాడుతూ వచ్చారు. కానీ చరణ్ మాత్రం దీనిపై నోరు మెదపలేదు. తాజాగా ఆయన ఆచార్య మూవీ ఫ్లాప్ పై స్పందించారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ.. ప్రేక్షకులు సినిమా చూసే పద్ధతి మారిపోయిందని కచ్చితంగా కంటెంట్ ఉంటేనే వారు ఆదరిస్తున్నారని అన్నారు. అలాగే సినిమాలో కంటెంట్ ఉందని వారు నమ్మితేనే సినిమా థియేటర్లకు వస్తున్నారని, ఆర్ఆర్ఆర్ లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత కూడా తాను ఒక చిన్న గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన సినిమా రిలీజ్ అయిందని అయినా సరే ప్రేక్షకులను ఆ సినిమా థియేటర్లకు రప్పించడంలో విఫలమైందని అన్నారు. ఈ క్రమంలోనే చరణ్ డైరెక్ట్గా చెప్పకపోయినా ఇన్డైరెక్ట్గా ఆచార్య గురించే మాట్లాడినట్లు అయింది. ఇక వెండితెరపై ప్రేక్షకుల్ని నిరాశపరిచిన ఆచార్య బుల్లితెరపై కూడా డిజాస్టర్గా నిలిచింది. చిరంజీవి కెరీర్లో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్స్ ఈ మూవీకే వచ్చాయి. ఈ క్రమంలోనే ఆచార్య ఫెయిల్యూర్ చిరంజీవిని ఇప్పటికీ వెంటాడుతుందని.. తాజాగా ఆయన మాట్లాడుతున్న మాటలను చూస్తే అర్థమవుతుంది.
ఇక ఆచార్య సినిమా కేవలం 6.30 టీఆర్పీ రేటింగ్ మాత్రమే రాబట్టింది. ఈ క్రమంలోనే రూ.100 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందగా ఈ సినిమా కేవలం వరల్డ్ వైడ్గా అతి తక్కువ కలెక్షన్స్ మాత్రమే రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు కూడా భారీ నష్టాలను మిగిల్చింది. ఈ సినిమా భారీ నష్టాలని చవి చూసిన నేపథ్యంలో తమ రెమ్యునరేషన్స్ను చిరంజీవి, రామ్చరణ్ వదులుకున్నారు. కాగా చరణ్ ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో మూవీ చేస్తున్నాడు. అలాగే చిరంజీవి భోళా శంకర్, వాల్తేర్ వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన చిరు మూవీ గాడ్ ఫాదర్ ఫర్వాలేదనిపించింది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్గా ఇషాన్ కిషన్ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…