Rakul Preet Singh : రకుల్ ప్రీత్ సింగ్.. అతి తక్కువ సమయంలోనే ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరటం సినిమాతో పరిచయమైన రకుల్ ఆ తర్వాత తన అందం, అభినయంతో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ స్టార్ హీరోల సరసన నటిస్తూ అదరగొట్టింది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది రకుల్. కెరీర్ లో చాలామంది స్టార్ హీరోలతో సినిమాలు చేసినా.. ఎందుకో రకుల్ అంతగా రిజిస్టర్ అవ్వలేక పోయింది. అయితే తన స్టైల్ లో సినిమాలు చేస్తూ మంచి నటిగా మాత్రం గుర్తింపు సాధించింది ఈ బ్యూటీ.
అయితే తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె హాస్పిటలైజ్ అయ్యిందని రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే రకుల్ ఎక్కడ సినిమాలు చేసినా.. ఒక విషయంలో మాత్రం స్ట్రిక్ట్ గా ఉంటుంది. బాడీ ఫిట్నెస్ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందంటే.. ఆమె రోజులో ఖాళీగా ఉన్న సమయాన్ని ఎక్కువగా జిమ్ కే కేటాయిస్తుంది. ఒక్కోసారి రోజుకి 6 గంటలు జిమ్ వర్కౌట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. హీరోయిన్ల మధ్య పెరుగుతున్న హెవీ కాంపిటేషన్.. వయస్సు దృష్టిలో ఉంచుకుని.. బాడీని కరెక్ట్ షేప్ లో ఉంచుకోవాలని.. ఆమె తెగ కష్టపడుతందట.
ఈ క్రమంలోనే ఆమె హాస్పిటల్ పాలైనట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నాజూగ్గా కనపడటానికి, జీరో సైజ్ తెచ్చుకోవడానికి రకుల్ డైటింగ్ అంటూ హెవీ వర్కౌట్ చేస్తూ.. సృహ తప్పి పడిపోయిందట. దీంతో ఆమెను వెంటనే హాస్పిటల్ కి తరలించారని సమాచారం. అయితే దీనిపై రకుల్ మేనేజర్ కానీ రకుల్ కానీ ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇంకా స్పందించలేదు. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే రకుల్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రజెంట్ రకుల్ కి ఎలా ఉంది.. ఏమైంది అంటూ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు రకుల్ త్వరగా కోలుకోవాలని కామెంట్ చేస్తున్నారు.
రష్మిక మందన్న, షాహిద్ కపూర్, కృతి సనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్టెయిల్ 2 సినిమా జూన్ 19, 2026న…
పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ వివాదానికి దారితీసింది. అసాధారణ పరిస్థితుల్లో సల్మాన్ అలీ ఆఘాను రన్ అవుట్గా…
సినిమాను మరింత సమగ్రంగా మార్చే లక్ష్యంతో కేంద్ర చలనచిత్ర సర్టిఫికేషన్ బోర్డు (CBFC) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026…
ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మహారాష్ట్ర ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు. నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో…
రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా పార్లమెంట్లో మొబైల్ ఫోన్ ప్రీపెయిడ్ రీచార్జ్ సమస్యను ప్రస్తావించారు. టెలికాం కంపెనీలు 28 రోజుల…
చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు భారీ స్థాయిలో సిబ్బందితో షూటింగ్కు వస్తారని, దీంతో వారికి చేసే ఖర్చు గణనీయంగా…
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్…
నటుడు ఆనంద్ దేవరకొండ సోషల్ మీడియాలో ఒక ఆనందకర కుటుంబ క్షణాన్ని పంచుకున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న…