Rajnikanth : సెలబ్రిటీ ప్రపంచంలో ప్రస్తుతం విడాకులు అనేవి కామన్గా మారిపోయాయి. బయట మార్కెట్కు వెళ్లి కూరగాయలు కొనుక్కుని వచ్చినంత తేలిగ్గా సెలబ్రిటీ జంటలు విడాకకులను తీసుకుంటున్నారు. సమంత, నాగచైతన్యల విడాకులు సంచలనం సృష్టించగా.. తాజాగా రజనీ అల్లుడు, నటుడు ధనుష్, రజనీ కుమార్తె ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తన కుమార్తె, అల్లుడు విడాకులు తీసుకోవడంపై రజనీకాంత్ తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. గతంలో ఆయన తీసిన బాబా అనే మూవీలో సైతం కుటుంబ అనుబంధాలు, ఆత్మీయతలపై పలు మార్లు ఆయన డైలాగ్లు చెప్పారు. అయితే ఆ డైలాగ్లు రజనీ జీవితంలోనే ప్రభావితం అవుతాయని బహుశా ఎవరూ ఊహించి ఉండరు.
ఇప్పటికే ధనుష్, ఐశ్వర్యలు పలు సందర్భాల్లో తమ మధ్య ఉన్న గొడవలపై రజనీకాంత్ వద్దకు వెళ్లారట. దీంతో రజనీ చాలా సార్లు వారిద్దరికీ నచ్చజెప్పారట. అయితే నిన్న మొన్నటి వరకు అంతా సద్దుమణిగిందని భావించే లోపే వారిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలా వారు తమ కుటుంబ సమస్యను రచ్చ చేయడం రజనీకి అసలు ఏమాత్రం ఇష్టం లేదట. దీంతో ఆయన తన కుమార్తె భవిష్యత్తు ఏమవుతుందా.. అని తల్లడిల్లిపోతున్నారట.
అయితే ధనుష్, ఐశ్వర్యలను మళ్లీ కలిపేందుకు ఆయన శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య ఉన్న గొడవలను సామరస్యంగా పరిష్కరించేందుకు రజనీకాంత్ చొరవ చూపుతున్నారట. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న గొడవలతో ఆయన ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ఇద్దరూ మళ్లీ కలుస్తారా.. లేదా విడిపోతారా.. అన్నది వేచి చూస్తే తెలుస్తుంది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…